40 ఏళ్ల నాటి ప్లాట్లు మాయం
విజయనగరం జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే అనుచరుల దందాతో బాధితులకు అష్టకష్టాలు
అధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం జరగని వైనం
డబుల్ కాలనీలోని లేఅవుట్ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: విజయనగరం జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నగరపాలక సంస్థ పరిధిలోని డబుల్ కాలనీ దారిలో దాదాపు 40 ఏళ్ల క్రితం వేసిన ప్లాట్లను మాయం చేసినట్లు సంబంధిత బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు వైకాపా నేత కాళ్ల గౌరీ శంకర్తో కలిసి శనివారం నిరసన తెలిపారు. వారి వివరాల ప్రకారం.. బాబామెట్టలోని డబుల్ కాలనీ సమీపంలో 1983లో సెంట్రల్ కో-ఆపరేటివ్ సొసైటీ దాదాపు 18 ఎకరాల స్థలంలో లేఅవుట్ వేసి ప్లాట్లుగా విభజించింది. అప్పట్లో కొందరు 200 చదరపు గజాలు, 300 చ.గ. చొప్పున స్థలాలను కొనుగోలు చేశారు. రెండు, మూడేళ్ల క్రితం వరకు వారి సర్వే రాళ్లు కనిపించేవి. కొన్ని నెలలుగా అక్కడ కొందరు వ్యక్తులు చదును చేశారు. రాళ్లన్నీ తీసేశారు. ఈ మేరకు కొనుగోలుదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందించలేదు. దీంతో కాళ్ల గౌరీ శంకర్ను ఆశ్రయించారు. తెదేపా నాయకుడు వజ్రపు శ్రీను, బాధితులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అనుచరులు, ఆయన బినామీలు ప్లాట్లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు కనీసం మాట్లాడడం లేదన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న గెడ్డను సైతం కప్పేశారని, ఎవరికీ అనుమానం రాకుండా పైపులైన్లు ఏర్పాటు చేశారన్నారు.
అధికారులు స్పందించలేదు..
1983లో ప్లాట్ నెం.38, 39 కింద స్థలాలు కొన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని, మా పిల్లలకు ఉపయోగపడతాయని ఇంతకాలం ఉంచాం. హద్దు రాళ్లు సైతం పాతాం. ప్రస్తుతం ఏవీ లేవు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాం. ఎవరూ సరిగా స్పందించలేదు. ఇటీవల మళ్లీ చదును చేశారు. ఇక్కడి వాళ్లను అడిగితే అధికార పార్టీ నాయకులు తీసుకున్నారని చెప్పారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- ఎం.సావిత్రి, బాధితురాలు
ఎమ్మెల్యే చేతుల్లో ఉందంట..
మా అమ్మ 1983లో ఇక్కడి స్థలాన్ని కొన్నారు. ఆమె వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఆమె నడవలేని పరిస్థితి. మా స్థలాన్ని చదును చేసేయడంతో కొన్ని రోజులుగా నేనే అధికారుల చుట్టూ తిరుగుతున్నా. డబుల్ కాలనీ సమీపంలో ఉన్న వారిని కలవగా.. ఎమ్మెల్యే పేరు చెప్పారు. దీంతో ఆయన అనుచరులను కలిశాను. అంతా స్వామి గారి చేతుల్లో ఉందని చెప్పారు.
- వి.శంకరరావు, బాధితుడు
మా స్థలం ఎక్కడుందో తెలియదు..
1983లో మా అత్తయ్య భాగ్యలక్ష్మి పేరున మా మావయ్య ఇక్కడి స్థలం కొనుగోలు చేశారు. గత మూడేళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాను. గతేడాది ఈ ప్రాంతాన్ని చదును చేశారు. ఎవరిని అడగాలో మాకు తెలియలేదు. ప్రస్తుతం మా స్థలం ఎక్కడుందో కూడా గుర్తించలేకపోతున్నాం. సొసైటీ సభ్యులు సైతం స్పందించడం లేదు.
- గ్రంధి శంభూ, బాధితుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరిగిన పైపులైన్లు.. తాగునీటి అవస్థలు
[ 17-05-2024]
మండలంలోని అంపావల్లి గ్రామంలోని తాగునీటి పైలెట్ ప్రాజెక్టు పరిధిలో పైపులైన్లు పగిలిపోతున్నాయి. -
సాగునీటి వనరులపై..చిన్నచూపేలా?
[ 17-05-2024]
జిల్లాలో సహజ వనరులకు లోటు లేదు. ఎక్కడికక్కడ నదులు.. వాగులు.. చెక్డ్యాంలు ఉన్నా.. పొలాలకు మాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. -
పురపాలిక నిధులతోనే అత్యవసర సేవలు
[ 17-05-2024]
అత్యవసర సేవలకు పురపాలిక నిధులే ఖర్చు చేస్తున్నామని మున్సిపల్ ప్రాంతీయ సంచాలకుడు నాగరాజు అన్నారు. మండలంలో గురువారం పర్యటించిన ఆయన తొలుత కమిషనర్ ఛాంబర్లో కూర్చుని అధికారులతో మాట్లాడారు. -
పౌరాణిక పాత్రలు.. గాయనిగా పాటలు
[ 17-05-2024]
పార్వతీపురం మండలంలోని బాలగుడబ గ్రామానికి చెందిన పౌరాణిక కళాకారిణి కొప్పర మంగాదేవి(మంగమ్మ) ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితులు. -
‘మిథ్యా’లయం!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది. -
ఓటరు తీర్పుపై ఎవరి ధీమా వారిదే..!
[ 17-05-2024]
ఎన్నికల యుద్ధం ముగిసింది.. పోటీలో తొలి నుంచి అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదిలారు. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. -
పట్టణవాసిపై పన్ను బాదుడు
[ 17-05-2024]
చంద్రబాబు హయాంలో అద్దె ప్రాతిపదికన పన్నులు విధించేవారు. ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకునేవారు. నామమాత్రపు వార్షిక పన్ను వసూలు చేసేవారు. -
షట్టర్లు ఇలా.. నీరు పారేదెలా?
[ 17-05-2024]
సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. దీని ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారికంగా 38,500 ఎకరాల ఆయకట్టుకు, అనధికారికంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. -
ఆ విపత్తు నుంచి ఎంతో నేర్చుకున్నా
[ 17-05-2024]
‘ఏడాది పాటు ఎంతో నేర్చుకున్నా. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది’ అని జిల్లా సహాయక కలెక్టర్ బి.సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. -
అదనపు దూరం... తప్పని భారం
[ 17-05-2024]
పాలకొండ ఆర్టీసీ డిపో గతంలో రీజియన్లోనే ఆదాయంలో మొదటి స్థానంలో ఉండేది. కానీ కొన్ని ఏళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. -
డోలీలోనే గర్భిణి ప్రసవం
[ 17-05-2024]
గిరిజనులు అత్యవసర వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు వారికి డోలీ మోతలు తప్పడం లేదు. జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న ఎస్.కోట నియోజకవర్గంలో మరోసారి ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంకెప్పుడు వేస్తారో..?
[ 17-05-2024]
కురుపాం మండలం పొడి పంచాయతీ సంతోషపురం కూడలి నుంచి మీగడ గ్రామం వరకు రూ.1.90 కోట్ల ఉపాధి నిధులతో బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గత ఏడాది జులై 25న భూమిపూజ చేశారు. -
ఎఫ్సీఐ పేరిట బెదిరింపులు
[ 17-05-2024]
ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఆహార కల్తీ నియంత్రణ శాఖ) పేరిట ఓ హాటల్ యాజమాన్యాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్సై హరిబాబు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
-
విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు