logo

‘అమ్మేసిన స్థలంలో వైకాపా కార్యాలయమా?’

విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆక్రమణలతో పాటు ఆయన వద్ద స్థలాలు కొనుక్కున్నవారినీ వేధిస్తున్నారని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్‌ ఆరోపించారు

Published : 05 May 2024 05:23 IST

 మాట్లాడుతున్న కాళ్ల గౌరీశంకర్‌

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆక్రమణలతో పాటు ఆయన వద్ద స్థలాలు కొనుక్కున్నవారినీ వేధిస్తున్నారని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్‌ ఆరోపించారు. విజయనగరంలో శనివారం ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆర్‌అండ్‌బీ రైతు బజారు నుంచి మహరాజా ఆసుపత్రికి వెళ్లే దారిలో వైకాపా కార్యాలయం ఉన్న స్థలాన్ని కోలగట్ల వీరభద్రస్వామి 2019లో కొంతమందికి అమ్మేశారని, ఇప్పటికీ కొనుగోలుదారులకు అందజేయలేదని ఆరోపించారు. ఆయన మాటల్లో.. ఐదేళ్లుగా అక్కడే కార్యాలయాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. అప్పట్లో అయిదుగురు వ్యక్తులకు అమ్మారని, అందులో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్‌రాజు సైతం ఉన్నారన్నారు. 3 నెలల్లో స్థలాన్ని అప్పగిస్తానని ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేతో పరీక్షిత్‌ రాజు కుమ్మక్కై కొనుగోలుదారులను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని