నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది.
పాఠశాలల్లో సమస్యల నమోదుపై శిక్ష
మౌలిక సదుపాయాలకు దూరంగా మునక్కాయవలస పాఠశాల
ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
పార్వతీపురం పట్టణం, విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: పాఠశాలల్లో సమస్యలను యూడైస్లో ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించి నీతి ఆయోగ్ నిధులు విడుదల చేస్తుంది. కానీ పాఠశాలల్లోని సమస్యలను ఉన్నది ఉన్నట్లు నమోదు చేయడంతో రాష్ట్ర ర్యాంకు దిగజారిపోయింది. దీంతో ఉపాధ్యాయులు తప్పు చేశారని ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చినట్లు సంఘాల సభ్యులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యంలో 32 పాఠశాలలకు తరగతి గదులు, 121 చోట్ల మరుగుదొడ్లు, 53 చోట్ల తాగునీరు, 56 పాఠశాలల్లో విద్యుత్తు, 336 చోట్ల ఇంటర్నెట్ కనెక్షన్ లేదని యూడైస్లో పేర్కొన్నారు. కానీ జాబితాలు తప్పుగా ఉన్నాయని, అన్నీ సక్రమంగా ఉన్నట్లు నివేదిక ఇవ్వాలని కోరుతున్నారన్నారు.
ఉమ్మడి జల్లాలో పరిస్థితి..
ఉమ్మడి జిల్లాల పరిధిలో పార్వతీపురం మన్యం నుంచి 537, విజయనగరంలో 35 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో సంతకవిటి, ఎస్.కోట, వంగర, వేపాడ, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, రేగిడి ఆమదాలవలస, రాజాం, రామభద్రపురం, బాడంగి, చీపురుపల్లి, పార్వతీపురం, సీతంపేట, భామిని, మక్కువ, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాలకు చెందిన వారున్నారు. సంబంధిత హెచ్ఎంలు, ఎంఈవోలు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి..
గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖపై ఈ అయిదేళ్లలో ఒత్తిడి పెంచారు. రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేశారు. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులకు నోటీసులు ఇస్తూ సస్పెన్షన్లు చేశారు. విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను దూషించారు. ఈ వైఖరిపై ఉపాధ్యాయులు, సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేసినా ఎలాంటి మార్పు రాలేదు.
- గతేడాది విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ప్రకాశ్ వీరఘట్టంలోని కేజీబీవీని సందర్శించారు. కొందరు విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయలేదని డీఈవో, ఎంఈవో, పాఠశాల ఎస్వోని సస్పెండ్ చేయడం విమర్శలకు దారితీసింది.
- ఉమ్మడి జిల్లాలో ముఖ హాజరు అమలు విషయంలో ఉన్నతాధికారుల తీరుతో గురువులు ఆందోళన చేపట్టారు.
- వర్కు, నోట్ పుస్తకాలను దిద్దలేదని రాష్ట్రస్థాయి అధికారులు హడావుడి చేసి నోటీసులు జారీ చేశారు.
- ఎన్నికల నేపథ్యంలో పాఠశాలల్లో ఉన్న పోలింగ్ బూత్లలో దివ్యాంగుల కోసం ర్యాంపుల నిర్మాణానికి బలవంతం చేయడంతో సొంత నిధులు వినియోగించామని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
తప్పు లేకపోయినా నోటీసులు..
అనేక పాఠశాలల్లో ఇంటర్నెట్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, గదుల కొరత సమస్యలున్నాయి. కానీ వీటిలో మార్పులు చేస్తూ నీతి ఆయోగ్కు ఉన్నతాధికారులు నివేదికలు ఇచ్చారు. ఉపాధ్యాయులు యూడైస్లో చేసిన నమోదులతో వాస్తవాలు వెలుగు చూశాయి. తప్పు సరిదిద్దుకునేందుకు అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం అందజేసిన నోటీసులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన తప్పదు.
- ఎస్.మురళీమోహన రావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
నాడు-నేడు పనుల ప్రగతి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిలకలపల్లి విద్యార్థికి తెలంగాణ ఈఏపీసెట్లో రెండో ర్యాంకు
[ 18-05-2024]
బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ సత్తా చాటాడు. -
వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు
[ 18-05-2024]
చిలకలపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారికి అర్చలకు కె.రాంబాబు శనివారం పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. -
‘ఈనాడు’ కథనానికి స్పందన
[ 18-05-2024]
మండలంలోని చిలకలపల్లి-జనార్ధనవలస గ్రామాల మధ్య రెండు చోట్ల విరిగిపోయిన తాగునీటి పైపులను నీటిసరఫరా విభాగం అధికారులు శనివారం మార్పిడి చేశారు. -
కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి
[ 18-05-2024]
మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు అధికారులు కనీస సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు డిమాండు చేశారు. -
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన