logo

ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్‌ చట్టం

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్‌మోహన్‌రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.

Published : 06 May 2024 03:10 IST

కొత్తపల్లి గీత

పార్వతీపురం, న్యూస్‌టుడే: ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్‌మోహన్‌రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు. ఆదివారం పార్వతీపురంలో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. భూమి పత్రాలను రైతులు దైవంలా భావిస్తారని, జగన్‌ మాత్రం వాటికి విలువ లేకుండా చేస్తున్నారన్నారు. కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారని, ఇప్పుడు ఆస్తులను లాక్కునేందుకు చూస్తున్నారన్నారు.  ఇంత ఘోరమైన చట్టం దేశంలో లేదన్నారు. ప్రభుత్వ సచివాలయమో, సర్క్యూట్‌ హౌస్‌లను కాకుండా జగన్‌ ఆస్తులు తాడేపల్లి ప్యాలెస్‌, లోటస్‌పాండ్‌ ప్యాలెస్‌ను కదువ పెట్టి అప్పులు తీసుకురావాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని