ఊడిపోతున్నాయ్... పంకా రెక్కలు
పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు.
పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు. ఆ పార్టీకి వెన్నుదన్నుగా, బలంగా నిలిచిన మండల, గ్రామస్థాయి నాయకులంతా తమ అనుయాయులతో కలిసి కూటమిలో చేరుతున్నారు. గ్రామాలకు గ్రామాలు తెదేపా, జనసేన, భాజపా వెంట నడస్తున్నాయి. దీంతో కూటమి అభ్యర్థుల్లో జోష్ నెలకొంది.
న్యూస్టుడే, గరివిడి
మంత్రి బొత్సకు దెబ్బపై దెబ్బ
పార్టీలో చేరినవారికి కండువా వేస్తున్న కళా వెంకటరావు
మంత్రి బొత్స సత్యనారాయణకు పెట్టని కోటగా ఉన్న మెరకముడిదాం మండలంలో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు చెందిన రాజకీయ వారసులతో పాటు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు అధిక సంఖ్యలో వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఎం.రావివలస, బుదరాయవలస, జి.మర్రివలస, కొత్తకర్ర, ఊటపల్లి, కొమ్మానివలస, పులిగుమ్మి, గొట్టిపల్లి, చినరవ్వాం తదితర గ్రామాల నుంచి 600 కుటుంబాలతో పాటు, సోమలింగాపురం, ఇప్పలవలస, పెదపూతికవలస గ్రామాల్లో కీలక వైకాపా నేతలు తెదేపా గూటికి వచ్చేశారు. గరివిడి మండలం వెదుళ్లవలసలో 100 కుటుంబాలు, కె.పాలవలస, గెడ్డపువలస గ్రామాల ప్రస్తుత సర్పంచులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. చీపురుపల్లి పట్టణంలో పలువురు వార్డు సభ్యుల ఆధ్వర్యంలోచాలా కుటుంబాలు సైకిలెక్కేశాయి.
గజపతినగరంలో కొత్త ఊపు
ఈ నియోజకవర్గంలో యువనేత, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ మక్కువ శ్రీధర్ వైకాపాను వీడి తెదేపాలోకి వచ్చారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామం నుంచి 200 కుటుంబాలు చేరాయి. బొండపల్లి మండలం మరువాడ సర్పంచి శ్రీనివాసరావు, మాజీ మండల ఉపాధ్యక్షుడు గొడ్డు రాము, దత్తిరాజేరు మాజీ జడ్పీటీసీ గొటివాడ పుష్పారావు, మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు కుమారుడు కృష్ణమూర్తినాయుడు వైకాపాకు బైబై చెప్పి పసుపు కండువాలు కప్పుకొన్నారు. వరుస చేరికలతో ఇక్కడ తెదేపా బలం పుంజుకోగా కీలక నేతలు దూరం కావడంతో వైకాపా కలవరపడుతోంది.
కోలగట్లకు ముచ్చెమటలు
విజయనగరం నియోజకవర్గంలో బలమైన బీసీ నేతలు ఎన్నికల వేళ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న పిళ్లా విజయకుమార్, వైకాపా యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, 8వ డివిజన్ కార్పొరేటర్ ద్వాదశి సుమతి, మాజీ కౌన్సిలర్లు జి.సత్యనారాయణ, జి.అప్పారావు, సర్పంచి కంది జగదీశ్వరి వంటి కీలక నేతలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వైకాపాకు చెందిన కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి, శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెదేపాలో చేరాయి. అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కాళ్ల గౌరీశంకర్ తెదేపాకు మద్దతు ప్రకటించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, కోలగట్ల అవినీతి, అక్రమాల చిట్టాను విప్పుతూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో కోలగట్లకు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది.
ఎస్ కోటలో ఉక్కబోత
శృంగవరపుకోట నియోజకవర్గంలో వైకాపా కీలక నేతలతో ఏకంగా ఒక వర్గం తెదేపాలో చేరిపోయింది. ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి సుధారాజు, మండలాధ్యక్షుడు ఎస్.సోమేశ్వరరావుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 15 మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావం చూపగల కీలక నేతలు ఇక్కడ వైకాపాకు దూరం కావడం ఆ పార్టీకి గట్టిదెబ్బ తగిలినట్టయింది. జామి మండలం కలగడ, రామయ్యపాలెం, కొత్తవలస మండలం తుమ్మకాపల్లి, ఎస్.కోట మండలం వీరనారాయణపురం, తలారి, బొడ్డవర గ్రామాల నుంచి వందల సంఖ్యలో వైకాపా శ్రేణులు తెదేపాలోకి వలసలు రావడంతో పసుపు దళం మంచి ఊపు మీద ఉంది. ఒక వైపు చేరికలతో తెదేపా బలం పుంజుకోగా ఆ పార్టీ కీలక నేత గొంప కృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా పనిచేస్తుండడం పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
పసుపు వర్ణం.. బొబ్బిలి కోట
బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరిగాయి. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి తెంటు అప్పలనాయుడు, సీర శంకరరావు, శంబంగి గురువుగారి అప్పలనాయుడు, రాయపల్లి సత్యనారాయణలతో పాటు వాలంటీర్లు సైతం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. చింతాడ గ్రామ వార్డు సభ్యులు పలు కుటుంబాలతో పసుపు కండువా వేసుకున్నారు. డి.గదబవలస, పెరుమాళి, చీకటిపేట, అప్పలంపేట, సోంపురం, కొత్తరేగ, కోటశిర్లాం, అలజంగి అలజంగి, ఎం.బూర్జివలస, చింతాడ, కలవరాయి, గొంగాడవలస గ్రామాల నుంచి పెద్దఎత్తున చేరారు. ఇప్పటికే ఇక్కడ బలంగా ఉన్న తెదేపా వలసలతో మరింత దృఢంగా మారి వైకాపాకు గాలి ఆడనివ్వడం లేదు.
బడ్డుకొండకు చుక్కెదురు
నెల్లిమర్ల నియోజకవర్గంలో వైకాపా నుంచి జనసేనలోకి భారీగానే చేరుతున్నారు. ఇక్కడ నుంచి కూటమి మద్దతుతో జనసేన అభ్యర్థిగా లోకం నాగ మాధవి బరిలోకి దిగిన తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలతో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుకు చుక్కెదురవుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా తెదేపా నేతలంతా జనసేన అభ్యర్థి వెన్నంటి నిలిచి కలిసికట్టుగా పనిచేస్తుండగా.. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండను వ్యతిరేకించే వారంతా జనసేనలోకి వలస వస్తున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ బంగారు సరోజినితో పాటు భోగాపురం మండలం మాజీ ఎంపీపీ ఇందుమతి వైకాపాను వీడారు. పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం మండలాల నుంచి పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీల ఆధ్వర్యంలో వందలాది కుటుంబాలు పెద్దఎత్తున జనసేనలోకి రావడంతో ఊపు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
[ 19-05-2024]
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
జీర్ణావస్థలో జీసీసీ
[ 19-05-2024]
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది. -
భూసార పరీక్షల ఫలితాలేవీ..?
[ 19-05-2024]
ఏ పంట పండించినా దిగుబడి బాగుండాలంటే భూమి సారవంతంగా ఉండాలి. దీని కోసం భూమిలో లోపాలు తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలి. దీంతో దిగుబడి పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
కూటమికి 160 పైగా సీట్లు ఖాయం
[ 19-05-2024]
రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం చీపురుపల్లిలోని నటరాజ్ రెసిడెన్సీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఉన్నవి 24 రోజులే.. నాడు-నేడు మాటేమిటి?
[ 19-05-2024]
రెండో విడత నాడు నేడు పనులు నిధుల కొరతతో 2023 అక్టోబరు నుంచి నిలిచిపోయాయి. ఏప్రిల్లో డబ్బులు విడుదలైనా సిమెంట్, ఇసుక వంటివి అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. -
వైకాపా కదలికలపై నిఘా అవసరం
[ 19-05-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ గది తెరిచిన ఘటనపై శనివారం బంగ్లాలో పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. -
ఈ ఖరీఫ్లో కన్నీరే!
[ 19-05-2024]
కళ్లెదుటే నీళ్లున్నాయి.. చేతుల్లో డబ్బులున్నాయి.. కానీ ఫలితం లేదు.. పొలం తడవదు.. పంట పండదు.. జలాశయాల ఆధునికీకరణకు జైకా నిధులిచ్చినా.. పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లిప్తత చూపించింది. ఫలితంగా మూడేళ్లు అవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. -
అనంతపురం ఎస్పీగా గౌతమీశాలి
[ 19-05-2024]
విశాఖపట్నం 16 బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది. -
ఈఏపీసెట్లో మెరుపులు
[ 19-05-2024]
తెలంగాణ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లాల విద్యార్థులు మెరిశారు. వ్యవసాయం, ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నాగుదాసరి రాధాకృష్ణ రెండో ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరానికి చెందిన దనుకొండ శ్రీనిధి పదో ర్యాంకు పొందారు. -
స్ట్రాంగ్ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు
[ 19-05-2024]
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM