అల్లరిమూకలకు హెచ్చరిక
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎదురయ్యే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామనే సంకేతం ఇచ్చే విధంగా మార్కాపురంలో పోలీసులు నిర్వహించిన మాబ్ ఆపరేషన్ (మాక్ డ్రిల్) స్థానికులను ఆకట్టుకుంది.
తుపాకీ ఎక్కుపెట్టి అల్లరిమూకలు వెళ్లిపోవాలంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పోలీసులు
మార్కాపురం నేర విభాగం న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎదురయ్యే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామనే సంకేతం ఇచ్చే విధంగా మార్కాపురంలో పోలీసులు నిర్వహించిన మాబ్ ఆపరేషన్ (మాక్ డ్రిల్) స్థానికులను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం స్థానిక గడియార స్తంభం కూడలిలో ఏఆర్, సివిల్, ఫైర్ సిబ్బంది అల్లర్ల సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సామాన్య ప్రజానీకానికి ఎలా రక్షణ కల్పిస్తారనే అంశాలపై పోలీసుల ప్రదర్శనలు సాగాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు తక్షణమే వెళ్లిపోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలసుందరరావు, సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ, గ్రామీణ ఎస్సైలు అబ్దుల్ రహమాన్, వెంకటేశ్వరనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ
[ 16-06-2024]
కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
నేలకు దిగొచ్చిన నెత్తికెక్కిన కళ్లు
[ 16-06-2024]
నాయకులు ఆదేశించారని అది ఎంత అడ్డగోలు వ్యవహారమైనా, చట్ట విరుద్ధమైనా నిబంధనలకు పాతరేసి మరీ అధికారులు పాటించారు. ప్రత్యర్థులపై ఎడాపెడా కేసులు కట్టేశారు. కాలు కదిపినా, నోరు మెదిపినా స్టేషన్లలో నిర్భంధించి వేధించారు. -
నాన్న నడిపించి.. జీవితంలో గెలిపించి
[ 16-06-2024]
నాన్న.. మాట కటువు అయినా మనసు మాత్రం వెన్న. ప్రతిక్షణం తన పిల్లల భవిష్యత్తుకే పరితపిస్తుంటాడు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. -
మంత్రి చొరవ బడికి మళ్లీ కళ
[ 16-06-2024]
పాఠశాలల విలీనం పేరుతో వైకాపా ప్రభుత్వం పేద పిల్లల చదువులతో చెలగాటమాడింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ కొన్నిచోట్ల ఏకంగా బడులను మూసేసింది. -
లంచావతారులు మాకవసరం లేదు
[ 16-06-2024]
‘పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు తీసుకునే అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి వారు తక్షణమే సెలవు పెట్టి వెళ్లి పోవాలి. లేకుంటే నేనే పంపిస్తా’... -
తెదేపాకు ఓటేశారని కక్ష.. తాగునీరు నిలిపివేత!
[ 16-06-2024]
ఎన్నికలు ముగిశాయి. వైకాపా ఘోర పరాజయం పాలైంది. ప్రజలు తెదేపా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని కొందరు వైకాపా సానుభూతి ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. -
మాలకొండలో ప్రజాప్రతినిధులు
[ 16-06-2024]
పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామిని కందుకూరు, చీరాల, కనిగిరి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం.కొండయ్య, ఉగ్రనరసింహారెడ్డి శనివారం దర్శించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM