ఇతరులను లోనికి రానీయొద్దు
ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం పరిశీలించారు.
స్ట్రాంగ్ రూమ్ సీలును పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీలుతో పాటు, అక్కడ భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీల నిఘాను తనిఖీ చేశారు. కళాశాల ప్రాంగణం మొత్తాన్ని సీసీ టీవీ పర్యవేక్షణలో ఉంచామని, గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించవద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గడువులోపు పనులు పూర్తయ్యేలా చూడాలని, అవసరమైతే కూలీలను పెంచాలని సూచించారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీవో జీవీ.సుబ్బారెడ్డి ఉన్నారు.
జిల్లాకు చేరిన 1,185 సర్వీసు ఓట్లు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఒంగోలు పార్లమెంట్కు చెందిన 1,185 సర్వీసు ఓట్లు ఒంగోలు చేరాయి. జిల్లాలో మొత్తం 6,693 సర్వీసు ఓట్లున్నాయి. అందులో బుధవారానికి 1,185 వచ్చాయి. తపాలా ద్వారా వచ్చిన వీటిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపించి పోస్టల్ బ్యాలెట్ పెట్టెలో వేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక కలెక్టర్ కె.ఝాన్సీలక్ష్మి పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ
[ 16-06-2024]
కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
నేలకు దిగొచ్చిన నెత్తికెక్కిన కళ్లు
[ 16-06-2024]
నాయకులు ఆదేశించారని అది ఎంత అడ్డగోలు వ్యవహారమైనా, చట్ట విరుద్ధమైనా నిబంధనలకు పాతరేసి మరీ అధికారులు పాటించారు. ప్రత్యర్థులపై ఎడాపెడా కేసులు కట్టేశారు. కాలు కదిపినా, నోరు మెదిపినా స్టేషన్లలో నిర్భంధించి వేధించారు. -
నాన్న నడిపించి.. జీవితంలో గెలిపించి
[ 16-06-2024]
నాన్న.. మాట కటువు అయినా మనసు మాత్రం వెన్న. ప్రతిక్షణం తన పిల్లల భవిష్యత్తుకే పరితపిస్తుంటాడు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. -
మంత్రి చొరవ బడికి మళ్లీ కళ
[ 16-06-2024]
పాఠశాలల విలీనం పేరుతో వైకాపా ప్రభుత్వం పేద పిల్లల చదువులతో చెలగాటమాడింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ కొన్నిచోట్ల ఏకంగా బడులను మూసేసింది. -
లంచావతారులు మాకవసరం లేదు
[ 16-06-2024]
‘పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు తీసుకునే అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి వారు తక్షణమే సెలవు పెట్టి వెళ్లి పోవాలి. లేకుంటే నేనే పంపిస్తా’... -
తెదేపాకు ఓటేశారని కక్ష.. తాగునీరు నిలిపివేత!
[ 16-06-2024]
ఎన్నికలు ముగిశాయి. వైకాపా ఘోర పరాజయం పాలైంది. ప్రజలు తెదేపా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని కొందరు వైకాపా సానుభూతి ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. -
మాలకొండలో ప్రజాప్రతినిధులు
[ 16-06-2024]
పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామిని కందుకూరు, చీరాల, కనిగిరి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం.కొండయ్య, ఉగ్రనరసింహారెడ్డి శనివారం దర్శించుకున్నారు.