ప్రభుత్వ విధానాలతో ఆక్వాలో సంక్షోభం
విద్యుత్తు ఛార్జీ రాయితీ అంటూ లేనిపోని నిబంధనలు అమలు చేస్తుండటంతో ఆక్వా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అసంబద్ధ విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకున్నారని రొయ్య రైతుల సంఘం జిల్లా కన్వీనర్ డి.గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న గోపీనాథ్.. చిత్రంలో ఆక్వా హేచరీస్ సంఘం ప్రతినిధులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: విద్యుత్తు ఛార్జీ రాయితీ అంటూ లేనిపోని నిబంధనలు అమలు చేస్తుండటంతో ఆక్వా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అసంబద్ధ విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకున్నారని రొయ్య రైతుల సంఘం జిల్లా కన్వీనర్ డి.గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హేచరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. పది ఎకరాల్లోపు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.1.50కే సరఫరా చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో 80 శాతం మందికి ఆ విధానాన్ని తొలగించినట్టు తెలిపారు. డీకేటీ భూముల్లో సాగు చేసే చెరువులకు, వెబ్ల్యాండ్లో నమోదు కాని వాటికి, ప్రభుత్వ భూములకు రాయితీ తొలగించినందున విద్యుత్తు రాయితీ ప్రయోజనాన్ని కేవలం 20 శాతం మంది మాత్రమే పొందుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎక్కువమంది తీరప్రాంతంలోని వృథా భూముల్లో ఉప్పునీటి ఆధారంగా, చిన్న, సన్నకారు రైతుల భూములు లీజుకు తీసుకుని రొయ్యల చెరువుల సాగు చేపట్టినట్టు తెలిపారు. వీరికి ప్రారంభంలో రాయితీ ఇచ్చి ఇప్పుడు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. విద్యుత్తు బిల్లుల భారం మోయలేక పలువురు ఇప్పటికే ఆక్వా సాగు విరమించుకున్నారని, మరికొందరు నష్టాల బారిన పడ్డారన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన రాయితీని కూడా తిరిగి చెల్లించాలంటూ విద్యుత్తు బిల్లుల్లో కలిపి నోటీసు ఇస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. హేచరీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. హేచరీలను సముద్రతీరానికి సమీపంలో నిర్వహించకూడదని ఆంక్షలు పెట్టడం వల్ల నిర్వాహకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీఆర్జడ్, కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ ఇష్టానుసారం నిబంధనలు విధిస్తుండటం కారణంగా హేచరీల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. ఇప్పటికే పలువురు మూసివేయగా, మరికొందరు ఉత్పత్తి తగ్గించుకున్నారన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రతినిధులు పి.సుబ్బారావు, ఎన్.సుభాజీ, టి.వెంకట్రావు, ఎస్.అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?