దేశ చరిత్రను కాపాడేది ఆచార్యులే
ప్రాచీన చరిత్రను కాపాడేందుకు ఆచార్యులంతా సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో వక్తలు
సమావేశానికి హాజరైన అధ్యాపకులు
కరెన్సీనగర్, న్యూస్టుడే: ప్రాచీన చరిత్రను కాపాడేందుకు ఆచార్యులంతా సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఏపీ హిస్టరీ కాంగ్రెస్ కార్యవర్గ నిర్వాహక కమిటీ సమావేశం ఆదివారం విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాల ఎస్జే బ్లాకులో నిర్వహించారు. కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసులరెడ్డి, ఆచార్య కిరణ్ క్రాంత్ చౌదరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక చరిత్రలను ఆయా ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, కొన్ని పాఠ్యాంశాలను తొలగించేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో వార్షిక సమావేశాన్ని విశాఖపట్నం బుల్లయ్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా నిర్వహించే సదస్సుకు అధ్యక్షునిగా గుంటూరు హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎం.సోమశేఖర్ను ఎన్నుకున్నారు. మిగిలిన విభాగాలకు సంబంధించి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎస్.మురళి మోహన్ (ప్రాచీన చరిత్ర), కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాల నుంచి డాక్టర్ జె.కృష్ణ ప్రసాద్బాబు(మధ్యయుగ చరిత్ర), మైసూరు రీజనల్ విద్యా సంస్థ తరఫున ఆచార్య ఎస్.ఎస్.గాంధీ(ఆధునిక చరిత్ర), మౌలానా ఆజాద్ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య ఎస్.ఎన్.అజీజ్ హుస్సేన్ (చరిత్ర రచన) అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సమావేశంలో చరిత్ర అధ్యాపకులు ఎ.రామచంద్రారెడ్డి, కొప్పర్థి వెంకట కృష్ణమూర్తి, కొల్లూరి సూర్యనారాయణ, గోవిందు సురేంద్ర, డాక్టర్ అజయ్బాబులు పాల్గొన్నారు. తొలుత ప్రిన్సిపల్ ఫాదర్ జి.ఎ.పి.కిషోర్, తెలుగు సీనియర్ అధ్యాపకులు ఆర్.రవీంద్ర భాస్లు సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!