Andhra news: ‘భూముల్లో ఆ ఎమ్మెల్యే వాటా అడుగుతున్నారు’
‘మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్రెడ్డి మా కుటుంబ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. పంచాయితీ పేరుతో తమకూ సగం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు.
తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న సుబ్బారెడ్డి, మునిరెడ్డి
మార్కాపురం, న్యూస్టుడే: ‘మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్రెడ్డి మా కుటుంబ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. పంచాయితీ పేరుతో తమకూ సగం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి..’ అని కోరుతూ మార్కాపురం మండలం బిరుదులనరవ గ్రామానికి చెందిన విశ్రాంత వీఆర్వో మునిరెడ్డి, ఆయన కుమారుడు సుబ్బారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులకు వారసత్వంగా వేర్వేరు సర్వే నంబర్లతో మొత్తం 65 ఎకరాల వరకు భూమి ఉందన్నారు. పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తినట్లు తెలిపారు. ఈ విషయం అధికార పార్టీ నాయకుల వద్దకు చేరడంతో వారు పంచాయితీ చేసి తమకు సగం వాటా ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, అతని సోదరుడి అండతో మా కుటుంబంలోని ఇతరులు భూమిని ఆక్రమించి దున్ని చదును చేసుకుంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో తాను జిల్లా కలెక్టర్, ఉప కలెక్టర్లను ఆశ్రయించినట్లు చెప్పారు. వారిచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. చివరికి తనకు అనుకూలంగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అదేమని అడిగితే తమపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క అధికారి ముందుకు రావడం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!