Ongole: ప్రాణం తీసి ఇంటికి తాళం వేసి.. చిన్నారి ఏడుపుతో వెలుగులోకి
వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఒంగోలు తాలూకా పోలీసుల వివరాల ప్రకారం.. నంధ్యాల జిల్లా గాజులపాలేనికి చెందిన కొండపల్లి గౌరి(32)కి అదే ప్రాంతానికి వెంకట్రెడ్డితో సుమారు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. సమీపంలోని నందిపల్లెకు చెందిన మహేష్ అనే యువకుడితో గౌరికి పరిచయమైంది. అతడికి కూడా వివాహమై పిల్లలు ఉన్నారు. మహేష్తో తన భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి వెంకట్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి. సుమారు నాలుగు నెలలక్రితం గౌరి, మహేష్ నంధ్యాల నుంచి ఒంగోలు వచ్చారు. గౌరి తన ఇద్దరు కుమార్తెలను స్వగ్రామంలోనే విడిచిపెట్టి పదేళ్ల చిన్న కుమార్తెతో కలిసి మహేష్ వెంట వచ్చింది.
స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. మహేష్ బేల్దారి పనులు చేసేవాడు. శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటి తర్వాత సద్దుమణిగింది. శనివారం ఉదయం గౌరి ఉంటున్న ఇంట్లోనుంచి ఆమె కుమార్తె బిగ్గరగా ఏడుస్తుండడంతో స్థానికులు వెళ్లి చూసేసరికి గౌరి మృతి చెంది ఉంది. మహేష్ ఆమెను హత్యచేసిన అనంతరం ఇంటికి తాళంవేసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్సై పున్నారావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గౌరి నిద్రించిన మంచం కింద తాడును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ శవాగారానికి తరలించారు. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడ్ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!