అంగన్వాడీ కార్యకర్తలపై నోరు జారి.. ఆపై చెంపలేసుకుని సారీ..
‘మీరు చదివింది పదో తరగతే. అయినా మీకు ప్రభుత్వం రూ.11,500 ఇస్తోంది. అదే చాలా ఎక్కువ. ఇంకా జీతాలు పెంచాలంటూ ధర్నాలు, సమ్మెలు చేయడం ఎందుకు...’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలనుద్దేశించి ఓ వ్యక్తి అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడారు. అందుకు ఆగ్రహించిన కార్యకర్తలు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ‘మీరు చదివింది పదో తరగతే. అయినా మీకు ప్రభుత్వం రూ.11,500 ఇస్తోంది. అదే చాలా ఎక్కువ. ఇంకా జీతాలు పెంచాలంటూ ధర్నాలు, సమ్మెలు చేయడం ఎందుకు...’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలనుద్దేశించి ఓ వ్యక్తి అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడారు. అందుకు ఆగ్రహించిన కార్యకర్తలు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం చోటుచేసుకుంది. నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలు ఒంగోలు కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి శిబిరం వద్దకు వచ్చారు. అంగన్వాడీలనుద్దేశించి మీకెందుకు జీతాలు పెంచాలంటూ దుర్భాషలాడారు. దీంతో కార్యకర్తలు, ఆయాలు అతన్ని చుట్టుముట్టి తమ సమస్యలు మీకేం తెలుసని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా తాము ఆందోళన చేస్తుంటే మీకేం నష్టమంటూ ప్రశ్నించారు. దీంతో అతను వారికి దండం పెట్టి మన్నించాలని కోరుతూ అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. అనంతరం అతని చిరునామా గురించి ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కార్యకర్తలు రెండో పట్టణ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి దీక్షలకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
కొనసాగుతున్న నిరసనలు...: అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో 33వ రోజైన శనివారం కొనసాగింది. ఒంగోలుతో పాటు, మద్దిపాడు, మర్రిపూడి, పొన్నలూరు, కనిగిరి, వెలిగండ్ల, మార్కాపురం, పెద్దదోర్నాల, టంగుటూరు, కొండపి, బేస్తవారపేట, యర్రగొండపాలెం, పొదిలి, దర్శి ప్రాంతాల్లోనూ దీక్షలు సాగాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా జగనన్నకు చెబుదాం అంటూ సంతకాల సేకరణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!