నిధులిచ్చేస్తే.. నాన్నొచ్చేస్తారు!: వేడుకల్లో బాలినేని ప్రణీత్రెడ్డి వ్యాఖ్యలు
‘ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాన్న(బాలినేని శ్రీనివాసరెడ్డి) హామీ ఇచ్చారు.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ‘ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాన్న(బాలినేని శ్రీనివాసరెడ్డి) హామీ ఇచ్చారు. వాటి కోసమే వేచి ఉన్నారు. రెండు రోజుల్లో రూ.170 కోట్లు విడుదలవుతాయనే సమాచారం ఉంది. ఆ తర్వాత నాన్న ఒంగోలు వచ్చేస్తారు..’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఏటా సంక్రాంతి వేడుకల్లో ఒంగోలులో గడిపే బాలినేని ఈసారి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు ప్రణీత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
చెల్లుబాటు కాకున్నా.. చాలా..!: ఇళ్లస్థలాలకు నిధులతో పాటు జిల్లా రాజకీయాల్లో తన మాట చెల్లుబాటు కావాలనేది బాలినేని భావన. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావులకు టికెట్ కోసమూ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మాగుంట విషయంలో అధిష్ఠానం భిన్నాభిప్రాయంతో ఉండగా.. దర్శి నుంచి పోటీ కోసం శిద్దా పట్టుబట్టారు. ఒంగోలు నుంచి ససేమిరా అన్నారు. చివరికి దర్శి సమన్వయకర్త బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి అధిష్ఠానం కట్టబెట్టింది. మాగుంటకు టికెట్ లేదనే స్పష్టత ఇచ్చేసింది. ఒంగోలు పార్లమెంట్కు వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి సిటింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరును తెర పైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ప్రణీత్రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇళ్ల స్థలాలకు నిధులొస్తే నాన్నొచ్చేస్తారు సరే.. ఆయన్నే నమ్ముకుని టికెట్లపై ఆశలు పెంచుకున్న వారి సంగతేంటనే చర్చ ఇప్పుడు మొదలైంది.
ఒంగోలును వీడి నెలయ్యే...: బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు నెల రోజులుగా అందుబాటులో లేరు. డిసెంబర్ 12న తన జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇంతలోనే ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను వైకాపా అధిష్ఠానం నియమించేసింది. మూడు రోజులపాటు నిరీక్షించినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకోకపోవడంతో కినుక వహించారు. ఆపై రాజకీయంగా ఆయన పయనం ఎటనే అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణీత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పలువురిని విస్మయానికి గురిచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!