Markapuram: ఆ బాలుడు.. అక్రమాల లోలుడు
మార్కాపురం మున్సిపాలిటీ పాలక వర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ నేత వ్యవహారశైలి అటు ప్రజలను, ఇటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
వసూళ్లకు విభాగాల వారీగా లక్ష్యాలు
పన్నుల నుంచి ప్లాన్ వరకు మామూళ్లు
మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ముఖచిత్రం
మార్కాపురం నేరవిభాగం, న్యూస్టుడే: మార్కాపురం మున్సిపాలిటీ పాలక వర్గంలో కీలకంగా వ్యవహరించే ఓ నేత వ్యవహారశైలి అటు ప్రజలను, ఇటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తనకు తెలియకుండా ఏ పనీ చేయొద్దంటూ ఇప్పటికే షరతులు విధించారు. ఇంటి పన్నులు మొదలుకుని నిర్మాణాలకు అనుమతుల వరకు అతని ప్రసన్నం దక్కాల్సిందే. లేదంటే ఆ దస్త్రం ముందుకు కదలదు.
చెబితేనే చేస్తానంటూ స్వామి భక్తి.. పురపాలక వర్గంలో కీలక నేత సమీప బంధువు ఒకరు ఇటీవల పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నులకు సంబంధించి రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసేందుకు ససేమిరా అనడంతో కొత్త ఎత్తుగడ వేశారు. ఆ స్థానాన్ని రెండుగా విభజించారు. గిద్దలూరు నుంచి తన విధేయుడైన అధికారి ఒకరిని డిప్యుటేషన్పై తీసుకొచ్చారు. అతనితో వసూళ్ల దుకాణం తెరిచారు. ఇందులోనూ అతను స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. సదరు నేత చెప్పనిదే ఏ పనీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు.
కాదంటే తప్పవు కొర్రీలు.. గతంలో ఎవరైనా కొత్తగా నిర్మాణం చేసుకుంటే సిబ్బంది పదేపదే ఆ ఇంటి చుట్టూ తిరిగి పన్నులు వేసేవారు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న వ్యక్తులే కొందరు రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అడిగినంత సమర్పించుకుంటే అటూఇటుగా ఇంటి పన్ను విధిస్తున్నారు. కాదంటే మాత్రం ఎక్కడి దస్త్రం అక్కడే ఉంటుంది. పైగా కొర్రీలు పెట్టి పని ముందుకు సాగకుండా చేస్తున్నారు. విధి లేని పరిస్థితిలో యజమానులు అడిగినంత సమర్పించుకొని పని పూర్తి చేయించుకుంటున్నారు.
తప్పుడు లెక్కలతో బెదిరింపులు..
వాస్తవంగా ఉన్న స్థలం, అందులోని నిర్మాణం, అంతస్తుల ఆధారంగా రెవెన్యూ విలువ లెక్కించి పన్ను విధించాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం తప్పుడు అంకెలు చూపి అడ్డగోలుగా దండుకుంటున్నారు. ఖాళీ స్థలం అంచనా నాటి నుంచి మూడు సంవత్సరాల క్రితం వరకు మాత్రమే వీఎల్టీ విధించాల్సి ఉంటుంది. పురంలో మాత్రం రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కట్టాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో యజమానులు ఆందోళనతో అడిగినంత ముట్టజెబుతున్నారు. కొత్తగా ఇళ్లకు అవసరమైన కుళాయి, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు.. ఇతర మౌలిక వసతులు కావాలంటే ఇంటిపన్ను రశీదు తప్పనిసరి. ఇదే ఆసరాగా రెవెన్యూ విభాగంలోని కొందరు ఇన్స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సచివాలయంలోని కార్యదర్శులను గుప్పెట్లో పెట్టుకుని సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. అడిగినంత ముట్టజెప్పిన తర్వాతే దస్త్రాలు ముందుకు కదులుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ సదరు నేత కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అవినీతి వ్యవహారం మరింత పెరిగింది. దీంతో అతనిపై కార్యాలయ సిబ్బందితో పాటు తోటి ప్రజాప్రతినిధులూ ఈసడించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!