AP News: సిద్ధమంటూ ఏంటీ యుద్ధం!.. జగన్ సభకు ఆర్టీసీ బస్సుల మళ్లింపు
సీఎం జగన్ యాత్రలంటే చాలు ఆర్టీసీ అధికారులు అమితమైన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. అడిగిన సంఖ్య కంటే ఎక్కువ బస్సులను అప్పనంగా అప్పగిస్తున్నారు. సాధారణ ప్రయాణికులతో చెలగాటమాడుతున్నారు.
ఎండల్లో అల్లాడిన ప్రయాణికులు
1. ఎక్కాల్సిన బస్సులు ఎప్పుడొస్తాయో తెలియదు...: వెలవెలబోతున్న
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్.. పడిగాపులు పడుతున్న ప్రయాణికులు
ఒంగోలు అర్బన్, మార్కాపురం అర్బన్ - న్యూస్టుడే: సీఎం జగన్ యాత్రలంటే చాలు ఆర్టీసీ అధికారులు అమితమైన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. అడిగిన సంఖ్య కంటే ఎక్కువ బస్సులను అప్పనంగా అప్పగిస్తున్నారు. సాధారణ ప్రయాణికులతో చెలగాటమాడుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి చుక్కలు చూపుతూ నరకయాతన అనుభవించేలా చేస్తున్నారు. బస్టాండ్లలో పిల్లాపాపలతో గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దయనీయ పరిస్థితిని చేజేతులారా కల్పిస్తున్నారు.
2. నావల్ల కాదు: నిల్చునే ఓపిక లేక ప్లాట్ఫాం వద్ద నీరసంగా కూర్చున్న ఓ వృద్ధుడు
పొరుగు జిల్లాకు పంపేశారు...: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రకు తెర లేపారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో శనివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ యాత్రకు జిల్లా నుంచి 210 బస్సులను అధికారులు మళ్లించారు. ఒంగోలు డిపో నుంచి 48, మార్కాపురం నుంచి 58, గిద్దలూరు నుంచి 42, పొదిలి నుంచి 30, కనిగిరి డిపో నుంచి 32 బస్సులు కేటాయించారు. దీంతో అత్యవసర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సినవారు, గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు బస్టాండ్లకు చేరుకుని బస్సులు లేక గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. పలువురు ప్రైవేట్ వాహనాల్లో అధిక ఛార్జీలు చెల్లించి ప్రయాణాలు చేయగా.. మరికొందరు గంటల తరబడి వేచి ఉన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటు విజయవాడ, ఒంగోలు వెళ్లేందుకు మార్కాపురం చేరుకున్న పలువురు యాత్రికులు ఎండ వేడికి విలవిల్లాడారు. జగన్ యాత్ర అంటే ఆర్టీసీ అధికారులు స్వామి భక్తిని చాటుకుంటూ జనానికి నరకం చూపడంపై పలువురు మండిపడ్డారు.
3. ఊరికి చేరే దారేదీ.!: కుర్చీలో దిగాలుగా ఓ యువకుడు
4. నిరీక్షించి.. నీరసించి...: బస్టాండ్లోని కుర్చీల్లో కునుకు తీస్తున్న ఓ మహిళ
మోకాలి నొప్పితో బాధ పడుతూ కర్రను ఊతంగా చేసుకుని నిల్చున్న ఓ ప్రయాణికుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు