హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులతో ప్రచారం
మార్కాపురంలో వైకాపా బరితెగింపు
కళాశాల యూనిఫాంలో వైకాపా ర్యాలీకి హాజరైన విద్యార్థులు
మార్కాపురం నేరవిభాగం, న్యూస్టుడే: అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురం పట్టణంలో అధికార వైకాపా ఆధ్వర్యంలో ఐటీ వింగ్ నిర్వహించిన ర్యాలీ వివాదాస్పదమైంది. ర్యాలీకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసినా స్పందన కరవైంది. దీంతో వైకాపా నేతలకు చెందిన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులను దీనికి తరలించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.షంషీర్ అలీబేగ్, యర్రగొండపాలెం పరిశీలికులు వెన్నా హనుమారెడ్డిలకు చెందిన ఏ1 గ్లోబల్, ఇందిరా ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులను బస్సుల్లో అక్కడికి తరలించారు. కళాశాల యూనిఫాంలతోనే వారు పార్టీ జెండాలు, ప్ల కార్డులను పట్టుకుని దీనంగా పార్టీ శ్రేణుల్ని అనుసరించారు. పార్టీ పాటలు, డీజే శబ్ధాలతో ప్రధాన రహదారిపై నేతలు నానాయాగీ సృష్టించారు. ర్యాలీలో మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ అలీబేగ్, రాష్ట్ర ఏపీఐఐసీ ఛైర్మన్ జంకె వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత జరిగినా అధికారులెవరూ దీన్ని నిరోధించలేదు. ర్యాలీతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహన దారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం తమ కళాశాలలకు సెలవులు ఇవ్వకుండా ఓట్లు వేసిన తరువాతనే ఊర్లకు వెళ్లాలని హుకుం జారీ చేశారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో నిలిచిన ట్రాఫిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 4 ఇంకా రాదేమి!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి వారమైంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్లలో పదిలంగా ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో విజేతలెవరనేది తేలిపోతుంది. -
ప్రమాదంలో తపాలా తీర్పు!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓట్లు నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలు స్ట్రాంగ్రూముల్లో కేంద్ర సాయుధ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు పహారాలో ఉన్నాయి. వీటి భద్రతపై అనుమానాలు లేవు. -
ఊరికో వైకాపా మారీచుడు
[ 21-05-2024]
వైకాపా నేతలు ఇసుక, మట్టిలో తెగ మేశారు. సహజ వనరులను కొల్లగొట్టి నమిలి మింగారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- జిల్లాలో అధికారికంగా ఒక్క రీచ్ కూడా లేకున్నా.. ఇసుక లభించే ప్రాంతాలను పంచేసుకున్నారు. -
జిల్లా జల్లెడ
[ 21-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. -
స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత
[ 21-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన నేపథ్యంలో ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణానికి సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను కల్పించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హర్షిత.. స్వర్ణ విజేత
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థిని నూకసాని హర్షిత సత్తా చాటి బంగారు పతకం కైవనం చేసుకుంది. -
రూ. కోట్ల వ్యయం.. నిర్లక్ష్యమే ఘనం
[ 21-05-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టే పనుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో అవి ఎవరికీ ఉపకరించడం లేదు. ముందుచూపు లేకుండా మొక్కుబడిగా చేయడంతో ఎవరికీ అక్కరకు రావడం లేదు. మార్కాపురంలోని సప్లయ్ ఛానల్ పనులే దీనికి సజీవ సాక్ష్యం. -
ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన
[ 21-05-2024]
మండలంలోని రామాపురంలో పట్టాభి రామస్వామి తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను అంబాల చినవెంకటరెడ్డి, నిర్వాహకులు ప్రారంభించారు. -
గుండ్లకమ్మ నదా! డంపింగ్ యార్డా..!!
[ 21-05-2024]
మార్కాపురం పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది పెద్ద డంపింగ్ యార్డుగా మారింది. పట్టణంలోని నివాసాల నుంచి సేకరించిన చెత్తను నదిలో పడేస్తుండటంతో నది కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.