logo

మా ఓట్లు అమ్ముకోం

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటేనే ప్రలోభాలకు వేదికలుగా మారాయి.

Published : 06 May 2024 02:13 IST

ఇంటి ప్రధాన గేటుకి ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన గయాజ్‌ బాషా

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటేనే ప్రలోభాలకు వేదికలుగా మారాయి. రాజకీయ పార్టీలు ఓటర్లు తమ వైపునకు తిప్పుకోవడానికి డబ్బులు ఎరవేస్తున్న రోజులివి. ఇలాంటి కాలంలో కూడా తాము ఓట్లు అమ్ముకోమంటూ కొందరు ఆదర్శంగా నిలుస్తున్నారు. కనిగిరి పట్టణంలోని బాదుల్లావీధికి చెందిన జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్‌ గయాజ్‌ బాషా ఎన్నికల్లో తమ కుటుంబంలోని ఓట్లు అమ్ముకోమని.. దేశం కోసం మా ఓట్లు- ప్రగతి కోసం మా ఓట్లు అంటూ ఆయన ఇంటి ప్రధాన గేటుకి ప్లెక్సీని ఏర్పాటుచేశారు. ఇది ఓటర్లను ఆకర్షిస్తోంది. అటుగా వెళ్లే వారు ఆగి మరీ ఫ్లెక్సీలోని అంశాలను చదువుతున్నారు. 

న్యూస్‌టుడే, కనిగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని