అధికారం ఉన్నోడిదే భూమి!
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు.
కొత్త చట్టంతో రైతులకు చిక్కులు
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. ఈ చట్టం వల్ల రైతులకు భూమి మీదే... కానీ హక్కు ఉండదు. అధికారం ఉన్నోడి కన్ను పడితే అంతే సంగతి. అంతిమంగా సామాన్య, మధ్యతరగతి, చిన్న, సన్నకారు రైతుల భూములకు భద్రత లేకుండా పోతుంది. -న్యూస్టుడే, త్రిపురాంతకం గ్రామీణం, పొదిలి, యర్రగొండపాలెం పట్టణం
రక్షణ లేకుండా పోతుంది
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుంది. ఈ చట్టం ద్వార మన భూముల రికార్డులు మారిపోయే ప్రమాదం ఉంది. వారసత్వ ఆస్తులను సైతం అధికారులు తేల్చడం ఏంటి. మన ఆస్తి వివాదాల్లో పడే అవకాశం ఉంది.
బి.వెంకట్రావు, రైతు.
సీఎం బొమ్మ ఎందుకో
పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పట్టా భూముల పాసు పుస్తకాలపై సీఎం జగన్ బొమ్మ పెట్టుకోవడం దారుణం. గతంలో ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించ లేదు. ఈ విధంగా రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై బొమ్మలు పెట్టుకుని లాక్కోవడానికి ప్రభుత్వం ఏమైనా కుట్రలు చేస్తుందా?.
పెద్దపూడి అంజిరెడ్డి, రైతు, త్రిపురాంతకం
చట్టాన్ని రద్దు చేయాలి
ఇప్పటి వరకు గ్రామాల్లో స్వల్ప భూవివాదాలను కోర్టుల్లో పరిష్కరించుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం ద్వారా బాధితులు హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా అధికారులను నియమిస్తే చట్టం వారి చేతుల్లోకి వెళ్తుంది. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలి.
దేవినేని చలమయ్య, ముడివేముల, త్రిపురాంతకం మండలం
తీవ్ర ఇబ్బందులు తప్పవు
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి చట్టాలు లేవు. పాసు పుస్తకాలపై జగన్మోహన్రెడ్డి చిత్రాలు వేయడం విచిత్రంగా ఉంది. ప్రజలు వారి ఆస్తులపై హక్కులు కోల్పోయే అవకాశం ఉంది. ఇలాంటి పనికిమాలిన చట్టాలను వెంటనే రద్దు చేయాలి.
కొత్తపల్లి శ్రీనివాసులు, మాజీ సర్పంచి, కంభం
ఆక్రమణలకు అవకాశం ఇచ్చినట్లే .. రద్దు చేయాల్సిందే
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయింది. కొత్తకొత్త చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందులకు గురిజేస్తున్నారు.రైతుల భూములకు విలువ లేకుండా పోయింది. ఈ చట్టం భూ ఆక్రమణలకు అవకాశం ఇస్తుంది. భూములపై హక్కులను కాలరాసినట్లు ఉంటుంది. ఒక్క అవకాశం అని గద్దెనెక్కి అన్నం పెట్టే రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులకు ఉపయోగపడదు.
బొడ్డు ఆంజనేయరెడ్డి, రైతు మురారిపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు