అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు.
జమ కాని విద్యా దీవెన నగదు
అప్పులు చేసి బకాయిల చెల్లింపు
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు.
క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా పామర్రులో ఈ ఏడాది మార్చి 1న నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి ‘జగనన్న విద్యాదీవెన’ పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికానికి జిల్లాలోని 47,422 మంది విద్యార్థులకు సంబంధించి రూ.36.44 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు జిల్లా అధికారులు కూడా ప్రకటించారు. రెండు నెలలు గడిచినా ఇంతవరకు సగానికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ కాలేదు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు విడతలుగా అందించాల్సి ఉంది. అందులో మొదటి విడత నగదే విడుదల కాలేదు.
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
ప్రచారం కోసం విధానాల మార్పు...: గతంలో బోధనా రుసుం నేరుగా కళాశాలలకే జమయ్యేది. తల్లిదండ్రులను కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేసేవి కావు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్ డబ్బులిస్తున్నారన్న విషయం తల్లిదండ్రులకు తెలియాలంటూ విధానాన్ని మార్చారు. తల్లుల ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తల్లిదండ్రులకు శాపంగా మారింది. ప్రభుత్వం జమ చేసే డబ్బు మీరే ఉంచుకోండి, మాకు మాత్రం ముందు ఫీజులు కట్టండంటూ కళాశాలల నుంచి ఒత్తిడి పెరిగింది.
విద్యార్థులపై విద్యా సంస్థల ఒత్తిళ్లు
ఇంజినీరింగ్తో పాటు, ఇతర డిగ్రీ కోర్సుల విద్యా సంవత్సరం ముగిసింది. దీంతో ఫీజులు చెల్లించాలని సదరు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు పలు కంపెనీల్లో ఐటీ ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదా విదేశాల్లో ఉన్నత చదువు నిమిత్తం వెళ్లేలా ప్రణాళిక చేసుకున్నారు. వీరికి ధ్రువీకరణ పత్రాలు అత్యవసరం. ఇదే ఆసరాగా కళాశాలల యాజమాన్యాలు ఫీజుల వసూళ్లకు మరింత ఒత్తిడి పెంచాయి. దీంతో అప్పులు చేసైనా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు తలెత్తింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దొరికినా నేరం కాదట.. విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు
[ 18-05-2024]
ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్ బూత్లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. -
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
[ 18-05-2024]
పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది. -
పండగలా సొంతూళ్లకొచ్చారు
[ 18-05-2024]
2024 సార్వత్రిక రణంలో ఓటర్లు ‘స్థానిక’ సమరం తరహా ఉత్సాహం చూపారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంటుంది. తక్కువ ఓట్లు ఉండటంతో ప్రతి ఒక్కటీ కీలకంగా భావిస్తారు. -
కొలువులకు చదువే సరిపోదు
[ 18-05-2024]
ఇది పోటీ ప్రపంచం.. నెగ్గుకు రావాలంటే అన్నింటా ఇతరులను మించి అదనపు అర్హతలు తప్పనిసరి. అందులోనూ కొలువులు సాధించాలంటే చదువొక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యమూ అవసరం. అది సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగ, ఉపాధి పొందవచ్చు. -
ఓటు వరకే నీళ్ల నాటకం
[ 18-05-2024]
ఎన్నికలు ముగియడంతో ఓటర్లతో ఇక పనేముందని వైకాపా అభ్యర్థులు, నేతలు అనుకుంటున్నారు కాబోలు. ఇన్ని రోజులు వారి చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీళ్లు సరఫరా చేయించారు. -
స్ట్రాంగ్రూమ్లను రోజూ సందర్శించండి
[ 18-05-2024]
ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఘాట్లో ప్రమాద ఘంటికలు
[ 18-05-2024]
ఎతైన కొండలు, లోతైన లోయలు, వంపులతో కూడిన మలుపులు ఉన్న నల్లమల లోని శ్రీశైలం రహదారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మూల మలుపుల వద్ద చోదకులు వాహనాల వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఓట్లు వేయలేదనే వైకాపా దాడులు
[ 18-05-2024]
-
ఉపాధి చూపే బండే ఊపిరి తీసింది..
[ 18-05-2024]
ఐస్క్రీం బండిలో ఐస్క్రీంలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ యువకుడిని అదే బండి ప్రాణం తీసింది. ఐస్క్రీం బండికి విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని గణపవరంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. -
బాలికపై అత్యాచారం
[ 18-05-2024]
బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన చిన్నదోర్నాలలో శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్సై అంకమ్మరావు తెలియజేసిన వివరాల మేరకు.. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!