తెదేపా గెలుపుతోనే దర్శి వికాసం
దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు.
మాట్లాడుతున్న ఎంపీˆ మాగుంట, చిత్రంలో గొట్టిపాటి లక్ష్మి, గోరంట్ల రవికుమార్
తాళ్లూరు, న్యూస్టుడే : దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, మాధవరం, కొత్తపాలెం, తాళ్లూరు గ్రామాల్లోని పలు వీధుల్లో ఆయన దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మితో కలసి గురువారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయించి ఈప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అవసరమైన వసతులు సమకూరుస్తామన్నారు. అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మాగుంట సహకారంతో దర్శి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామన్నారు. దర్శిని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. పలుచోట్ల మహిళలు పెద్దఎత్తున పూలను చల్లి స్వాగతం పలికారు. పలు సెంటర్ల వద్ద భారీ గజమాలలతో సత్కరించారు. ఎంపీ తనయుడు నిఖిల్రెడ్డి, దర్శి తెదేపా ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పాపారావు, ఆయా గ్రామాల తెదేపా ప్రధాన నాయకులు, మండల తెదేపా ప్రధాన నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. కూలిన ప్రాంతం గుర్తింపు!
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్