logo

తెదేపా గెలుపుతోనే దర్శి వికాసం

దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని  ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు.

Published : 10 May 2024 01:58 IST

మాట్లాడుతున్న ఎంపీˆ మాగుంట, చిత్రంలో గొట్టిపాటి లక్ష్మి, గోరంట్ల రవికుమార్‌

తాళ్లూరు, న్యూస్‌టుడే : దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని  ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, మాధవరం, కొత్తపాలెం, తాళ్లూరు గ్రామాల్లోని పలు వీధుల్లో ఆయన దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మితో కలసి గురువారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయించి ఈప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అవసరమైన వసతులు సమకూరుస్తామన్నారు. అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మాగుంట సహకారంతో దర్శి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామన్నారు. దర్శిని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.  పలుచోట్ల మహిళలు పెద్దఎత్తున పూలను చల్లి స్వాగతం పలికారు. పలు సెంటర్ల వద్ద భారీ గజమాలలతో సత్కరించారు. ఎంపీ తనయుడు నిఖిల్‌రెడ్డి, దర్శి తెదేపా ఇన్‌ఛార్జి గోరంట్ల రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే పాపారావు, ఆయా గ్రామాల తెదేపా  ప్రధాన నాయకులు, మండల తెదేపా ప్రధాన నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని