‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు.
దళారుల చేతిలో మోసపోతున్న రైతులు
రహదారిపై ఆరబెట్టిన సన్నరకం ధాన్యం
న్యూస్టుడే, నరసన్నపేట: ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. ప్రస్తుతం రబీ వరి పైర్లు కోతల దశలో ఉండగా.. ధరలపై రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ధర విషయంలో కోతలు పెడుతూ దళారులు మోసగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్దతు ధర కంటే కాస్త ఎక్కువకే కొనుగోలు చేస్తున్నా.. సన్నరకాల ధాన్యం గిరాకీ మేరకు ధరలు పలకడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా రబీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, సన్నరకం ధాన్యంపై అధికారుల నిఘా లేకపోవడం దళారులకు కలిసొచ్చినట్లయింది.
జిల్లావ్యాప్తంగా రబీలో 12,334 ఎకరాల్లో వరి సాగు చేయగా.. అందులో దాదాపు ఆర్ఎన్ఆర్, 1010 వంటి సన్నరకాలనే పండించారు. ప్రస్తుతం చాలా చోట్ల కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఎచ్చెర్ల, గార, జలుమూరు, టెక్కలి, నరసన్నపేట, తదితర మండలాల్లో 1,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. మొత్తం 29 మండలాల్లో వరి సాగు జరుగుతోంది. రబీలో దాదాపు 35 వేల టన్నుల ధాన్యం దిగుమతి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రబీలో సాధారణ రకం ధాన్యం అమ్మేందుకు తంటాలు పడాల్సి వస్తుండటంతో పాటు విపణిలో సన్నరకాలకు గిరాకీ ఉన్నందున అన్నదాతలు రబీలో ఆర్ఎన్ఆర్ వంటి రకాల సాగుపై దృష్టి సారించారు. ఇప్పుడు వాటికి సరైన ధర లేక దిగులు చెందుతున్నారు.
రోజురోజుకూ క్షీణిస్తూ..
జిల్లాలో వరి సాగు ప్రారంభం నాటికి 80 కిలోల బస్తా ధర రూ.2,600 వరకు పలికేది. కోతలు ఆరంభమైన తరుణంలో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించి.. రూ.2 వేల వంతున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సన్నాల రకం 80 కిలోల బస్తా ధర రూ.1,762 కాగా.. 83 కిలోల బస్తా ధాన్యాన్ని రూ.2 వేలకు కొంటున్నారు. మద్దతు ధర కంటే ఎక్కువకే పంట అమ్ముడుపోతున్నా.. అది కూడా రైతులకు గిట్టుబాటు కాదు. దీన్ని అవకాశంగా తీసుకుని దళారులు ధరలను ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ముగిసే వరకు సన్నరకాల ధరలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. నెల రోజుల నుంచి సన్నరకాలపై బస్తాకు రూ.600 వరకు తగ్గిపోయింది.
వ్యాపారులదే హవా..
నేను 7 ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ వరి సాగు చేస్తున్నాను. ఇప్పటికే కొంత మేర కోత కోసి నూర్పిడి చేశాను. సన్నరకాల ధాన్యం ధరలను దళారులు ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారు. ధరలపై ప్రభుత్వ ప్రమేయం లేకపోవడంతో వ్యాపారులదే హవాగా మారింది. తూకంలోనూ 3 కిలోల వంతున అదనంగా తీసుకుంటున్నారు.
- నేతింటి విశ్వేశ్వరరావు, నరసన్నపేట
కష్టపడినా ఫలితం లేదు..
ఎన్నో కష్టాలు పడి రబీలో వరి సాగు చేసినా ఫలితం లేదు. సాగునీరు అందుబాటులో లేక ఎక్కువ ఖర్చు చేసి దూరం నుంచి నీటిని రప్పించాం. తీరా పంట చేతికొచ్చిన తర్వాత ధరలు కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం మా ఊరిలో 83 కిలోల ధాన్యం బస్తా రూ.1,950కు కొనుగోలు చేస్తున్నారు.
- పాగోటి అప్పలనాయుడు, కంబకాయ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భర్త పార్లమెంటుకు.. భార్య అసెంబ్లీకి పోటీ
[ 01-05-2024]
చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామానికి చెందిన కాయ దుర్గారావు, ఆయన భార్య కామేశ్వరి నరసన్నపేటలోని పెద్దపేట సమీపంలో చేపలు విక్రయిస్తుంటారు. -
కర్కశ ప్రభుత్వమా.. కనిపించదా కష్టం..!
[ 01-05-2024]
రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాలోచనతో అధికార పార్టీ ఆడిస్తున్న వికృత క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతోంది. ఇంటి వద్దే పింఛన్లు అందజేసే అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేసి.. జగన్ సర్కారుకు లబ్ధి చేకూర్చాలనే శైలిలో వ్యవహరిస్తోంది. -
గిరిబిడ్డలు గుర్తులేరా
[ 01-05-2024]
కొత్తూరు మండలం కారిగూడ, అడ్డంగి, గొట్టిపల్లి, అల్తీ, తదితర పంచాయతీల్లో 1,600 మందిపైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరి కొత్తూరు, కురిగాం, నివగాం గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే ఆయా గ్రామాల నుంచి ఆటోలు, బస్సులే దిక్కు. -
ఖాదీ బతుకులంటే చిన్న చూపా..?
[ 01-05-2024]
‘అత్యున్నత ప్రమాణాలున్న సన్నఖాదీ పొందూరు సొంతం. ఏడు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుతోంది. మహాత్మాగాంధీ నుంచి అమెరికా పూర్వ అధ్యక్షుడు బిల్క్లింటన్ వరకు దీన్ని మెచ్చినవారే.. ఇంతటి ఖ్యాతి ఉన్న ఈ ఖాదీకి ఆ స్థాయిలో చేయూత అందలేదు. -
సైకిలెక్కుతున్న జగనన్న సైన్యం..!
[ 01-05-2024]
-
4 నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 01-05-2024]
ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో జిల్లా అంతటా ఒకే చోట పోస్టల్ బ్యాలెట్ను వినియోగించారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కొరడా..!
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 01-05-2024]
ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలు వెళ్లగొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారని ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు అన్నారు. -
పాలన పూర్తి.. పనులు అసంపూర్తి..!
[ 01-05-2024]
జిల్లా పరిపాలనకు కలెక్టర్ కార్యాలయం గుండె వంటిది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు గడిచినా నగరంలోని కలెక్టరేట్ భవనాల నిర్మాణం పూర్తికాలేదు. నిధులు సకాలంలో విడుదల చేయక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. -
ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పాలకులను ఓడించండి
[ 01-05-2024]
ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పాలకులను ఓడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. -
నిష్పక్షపాతంగా పని చేయండి
[ 01-05-2024]
ఎన్నికల సిబ్బందిపై ఎంతో గురుతర బాధ్యత ఉందని, ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పని చేయాలని వ్యయ పరిశీలకులు శరవణకుమార్, కోమల్ జీత్ మీనా, నవీన్కుమార్ సోనీ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?