ముఖ్యమంత్రి గారూ.. బటన్ నొక్కేస్తే నీళ్లిచ్చినట్లేనా..
ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార జలాశయం నుంచి ఉపరితల జలాలు అందిస్తామని జగన్ ఊదరగొట్టారు.
ఉద్దానానికి ఉపరితల జలాలంటూ ప్రచారం
సగం గ్రామాలకు కూడా అందని వైనం
న్యూస్టుడే, శ్రీకాకుళం
ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార జలాశయం నుంచి ఉపరితల జలాలు అందిస్తామని జగన్ ఊదరగొట్టారు. ఆ మేరకు మెగా వాటర్ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని గతేడాది డిసెంబర్ 14న సీఎం ఆర్భాటంగా బటన్ నొక్కి ప్రారంభించేశారు. ఇంకా చాలా వరకు ట్యాంకులు, ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో మూడో వంతు గ్రామాలకు ఉపరితల జలాలు అందట్లేదు. మిగిలిన ప్రాంతాలకూ నామమాత్రంగా రెండు, మూడు రోజులకు ఒకసారి సరఫరా జరుగుతోంది. ఈ పథకం రెండేళ్ల కిందటే అందుబాటులోకి రావాల్సి ఉన్నా సకాలంలో నిధులు సమకూర్చలేకపోయారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా మిగిలిన పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది.
జిల్లాలో కిడ్నీ వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్న మండలాలైన కవిటిలో 89, కంచిలిలో 90, మందసలో 87, వజ్రపుకొత్తూరులో 47, సోంపేటలో 28, ఇచ్ఛాపురంలో 23, పలాసలో 24 ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించాలి. జల్జీవన్ మిషన్ పనుల్లో భాగంగా ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. బిల్లుల చెల్లింపులో సమస్య కారణంగా అవి ఇప్పట్లో పూర్తి చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరో రెండు, మూడేళ్లు దాటితే తప్ప ఉద్దానం వాసులకు ఉపరితల జలాలు అందించే అవకాశం లేకుండా పోయింది. 807 గ్రామాలకు 499 చోట్ల ఇంటింటా కుళాయి పనులు చేపట్టారు. అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. మరో 308 గ్రామాల్లో పనుల పూర్తికి మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పరిధిలో ఉపరితల జలాల పంపిణీకి కొత్తగా ట్యాంకు నిర్మించాలి. మూడు దశాబ్దాల కిందట నిర్మించిన పాత ఉద్దానం ట్యాంకు ద్వారా ఇక్కడికి నీటి సరఫరాకు పైపులైన్ పనులు చేపట్టారు. కొత్త ట్యాంకు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో నీరందే అవకాశం లేదు. ఇదే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది.
- కంచిలి మండలం జలంత్రకోట వద్ద నిర్మిస్తున్న గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇక్కడ ఓవర్హెడ్ సర్వీసు రిజర్వాయర్ ట్యాంకు నిర్మాణం పనులు పూర్తి కాలేదు. గిరిజన గ్రామాలకు సంబంధించి నీటి సరఫరాకు ఇప్పటికీ అవకాశం లేదు.
- హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి ఇచ్ఛాపురం వరకు వంశధార జలాలు తీసుకురావడానికి 140.42 కి.మీ. మేర ప్రధాన పైపులైన్ ఏర్పాటు చేశారు. 866.08 కి.మీ. మేర అంతర్గత పైపులైన్ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీడని గ్రహణం..!
[ 18-05-2024]
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న గంగాసాగరం జలాశయం పనులు ఐదేళ్లుగా ముందుకు కదలకపోవడంతో రైతులు సాగుకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. -
పోలీసు వలయంలో మూలపేట
[ 18-05-2024]
సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిసర ప్రాంతాలు శుక్రవారం పోలీసుల ఆధీనంలోకి వెళ్లాయి. -
పారిశుద్ధ్య కార్మికుడి దారుణహత్య
[ 18-05-2024]
జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నిద్రిస్తున్న యువకుడి గొంతు కోసి హతమార్చిన ఘటన శ్రీకాకుళం నగరంలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది కలిపి 25,448 మంది ఉన్నారు. -
కట్టడం కుదరనప్పుడు ఎందుకు కూల్చేశారు..?
[ 18-05-2024]
అనువుగాని ప్రదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ మైదానం నిర్మిస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు మాయమాటలు చెప్పారు. -
పుట్టెడు శోకంలోనూ ఔదార్యం!
[ 18-05-2024]
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు పుట్టెడు శోకంలోనూ ఔదార్యం చాటుకున్నారు. -
నత్తనడకన నీటి తీరువా పనులు
[ 18-05-2024]
వంశధార కాలువల పరిస్థితి రోజురోజుకీ అత్యంత దయనీయంగా మారుతోంది. దశాబ్దాల కాలంగా అవి నిర్వహణకు నోచుకోకపోవడంతో కునారిల్లుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు