చేయూత అందించడానికి చేతులు రాలేదు..!
ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన వి.వైకుంఠరావు వెల్డింగ్ పనిలో నిపుణుడు. కొన్నేళ్ల నుంచి రోజు కూలీగా పని చేస్తున్నాడు. రూ.రెండు మూడు లక్షలతో సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక.. అప్పు పుట్టక రోజు ఆశ నెరవేరలేదు.
జగన్ పాలనలో యువత ఆశలకు సమాధి
స్వయం ఉపాధి రుణాలకు ఎసరు
ఉత్సవ విగ్రహాలుగా మారిన ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు
న్యూస్టుడే, పాతశ్రీకాకుళం
ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన వి.వైకుంఠరావు వెల్డింగ్ పనిలో నిపుణుడు. కొన్నేళ్ల నుంచి రోజు కూలీగా పని చేస్తున్నాడు. రూ.రెండు మూడు లక్షలతో సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక.. అప్పు పుట్టక రోజు ఆశ నెరవేరలేదు. ప్రభుత్వం రాయితీపై రుణం అందిస్తే స్వయం ఉపాధి పొందుతూ మరో నలుగురికి పని ఇప్పించగలనని చెబుతున్నాడు. ఐదేళ్లుగా అతనికి ఎదురుచూపులే మిగిలాయి.
శ్రీకాకుళం నగరంలోని కొత్త హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కె.లక్ష్మణరావు కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ రాయితీపై రుణం మంజూరు చేస్తే సొంతంగా కారు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందాలని ఆశ పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
జగన్ వేదిక ఎక్కగానే ‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’.. అంటూ ఆయా సామాజిక వర్గాలను ఉద్దరిస్తున్నట్లు ప్రసంగిస్తుంటారు. వారికి చేయూత అందించడానికి మాత్రం ఆయనకు చేతులు రాలేదు. జిల్లాలో ప్రభుత్వ సాయంతో స్వయం ఉపాధి పొందాలని ఎదురుచూస్తున్న పేద వృత్తి నిపుణులు వేల సంఖ్యలో ఉన్నారు. వాహనాల కొనుగోలు, దుకాణాల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణం మంజూరుకు సంబంధించిన ప్రకటన ప్రభుత్వం జారీ చేయకపోవడంతో ఉసూరుమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఏటా రుణాలు పంపిణీ చేశారు. వైకాపా పాలనలో ఆ ఊసే లేకుండా పోయింది. కులాలు, ఉప కులాలు వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించడానికే పరిమితమయ్యారు. వారి పదవీ కాలం రెండుసార్లు పొడిగించినా ఆయా కులాల పరిధిలో యువతకు స్వయం ఉపాధి చూపలేకపోయారు.
గతం ఘనం..
తెదేపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో నిరుద్యోగులకు రాయితీతో కూడిన రుణాలు అందేవి. యూనిట్ వ్యయంలో పది శాతం లబ్ధిదారు చెల్లిస్తే రుణం మంజూరయ్యేది. 50 శాతం రాయితీ కాగా.. మిగిలిన మొత్తానికి నామమాత్రపు వడ్డీ వేసేవారు. లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందుతూ వాయిదాల రూపంలో చెల్లించేవారు. వైకాపా పాలనలో బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు. నవరత్నాల పేరిట మంజూరు చేసిన పథకాలను కులాల వారీగా విభజించి లబ్ధి పొందుతున్నట్లు చెబుతున్నారు. స్వయం ఉపాధి నిమిత్తం రుణాలు మంజూరు చేయలేదు.
దరఖాస్తుల బుట్ట దాఖలు
2017-18 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 11,833 మందికి రూ.63.31 కోట్ల మేర స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడితే ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న వారు, రోజు కూలీ చేసుకుంటూ స్వయం ఉపాధి చూసుకోవాలనుకునే వారు సుమారు 50 వేలకు పైగానే ఉంటారు. ఐదేళ్లలో ఉద్యోగ నియామక ప్రకటనలు లేకపోవడంతో నిరుద్యోగులు రోజు కూలీ, ప్రైవేటు పనులపై ఆధారపడుతున్నారు.
రాయితీ మాత్రమే..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీల్లో నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2019-23 వరకు మొక్కుబడిగా ఇచ్చిన స్వయం ఉపాధి రుణాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా రాయితీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!