చేసింది తక్కువ.. చెప్పింది ఎక్కువ..!
జిల్లాను తానే ఉద్ధరించినట్లుగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఊదరగొట్టారు. చెప్పుకోవడానికి ఒక్క పనీ పూర్తి చేయకుండానే.. ఎంతో అభివృద్ధి చేసేశామంటూ డప్పు కొట్టారు. సీఎం ప్రసంగం విని ప్రజలు విస్మయానికి గురయ్యారు.
జిల్లాను తానే అభివృద్ధి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం
ఇచ్ఛాపురంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం, సోంపేట, న్యూస్టుడే: జిల్లాను తానే ఉద్ధరించినట్లుగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఊదరగొట్టారు. చెప్పుకోవడానికి ఒక్క పనీ పూర్తి చేయకుండానే.. ఎంతో అభివృద్ధి చేసేశామంటూ డప్పు కొట్టారు. సీఎం ప్రసంగం విని ప్రజలు విస్మయానికి గురయ్యారు. రాజకీయ విమర్శలు, గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారని పలువురు పేర్కొన్నారు.
జగన్ ఏమన్నారు.. ఏం జరిగింది..
- ‘మూలపేట వద్ద రూ.4,400 కోట్లతో పోర్టు నిర్మాణ పనులు వాయువేగంతో జరుగుతున్నాయి.’ ఓ ప్రైవేటు కంపెనీకి సర్వం అప్పగించి జేబు సంస్థగా మార్చుకున్నారు. సామగ్రి సమకూర్చే గుత్తేదారుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అక్కడి బాధితులకు పరిహారం అందించకుండా కాలయాపన చేస్తున్నారు.
- ‘బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి.’ ఐదేళ్లుగా గుర్తుకు రాని పనులు ఎన్నికల సమయంలో ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఆర్భాటం చేస్తున్నారు. బుడగట్లపాలెం వద్ద నత్తనడకన సాగుతున్నాయి. మంచినీళ్లపేట వద్ద పనులను ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.
- ‘రూ.80 కోట్లతో కిడ్నీ ఆసుపత్రి పరిశోధనా కేంద్రానికి పునాది వేసి పూర్తి చేశాం’. తెదేపా హయాంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో ఒప్పంద ప్రాతిపదికన ప్రారంభించిన డయాలసిస్ తప్ప జగన్ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన వైద్య సేవల్లో ఒక్కటీ అందడం లేదు. కిడ్నీ సమస్య మూలాలు తెలుసుకోవడానికి పరిశోధనలు శూన్యం. సూపర్ స్పెషాలిటీ వైద్యులే లేరు. ఆర్భాటంగా నిర్మించిన భవనం తప్ప పూర్తిస్థాయిలో వైద్యం అందుబాటులోకి రాలేదు.
- ‘రైతులకు న్యాయం చేశాం’. రెండు పంటలకు సాగునీరందిస్తామని మోసం చేశారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులను అనుసంధానం చేయకుండా సాగునీరు ఇవ్వకుండా ముంచేశారు. అసంపూర్తిగా ఉన్న రిజర్వాయర్ల పనులు పూర్తిచేయలేకపోయారు. నారాయణపురం ఆనకట్టను ఆధునికీకరించలేదు. ఈదుపురం ఎత్తిపోతల పథకం, పైడిగాం ప్రాజెక్టును గాలికొదిలేశారు.
- ‘దశాబ్దాలుగా నెలకొన్న ఉద్దానం సమస్యను పరిష్కరించాం. రూ.780 కోట్ల ఖర్చు చేసి హిరమండలం నుంచి నీరందించాం’. మెగా వాటర్ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ఎన్నికలు వస్తున్నాయని ఆగమేఘాలపై బటన్ నొక్కి ప్రారంభించారు. ఇప్పటికీ చాలావరకు ట్యాంకులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయలేదు. మూడో వంతు గ్రామాలకు ఉపరితల జలాలు అందని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు రోజులకు ఒకసారే కొన్ని గ్రామాలకు నీరు అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన