దువ్వాడకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్లే
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తే అది చెత్తబుట్టలో వేసినట్లేనని వైకాపా మండల మాజీ అధ్యక్షుడు, తెదేపా నేత బగాది హరి అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న తెదేపా నేత హరి ప్రచారం
ఉపాధి వేతనదారులతో మాట్లాడుతున్న బగాది హరి
టెక్కలి, న్యూస్టుడే: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తే అది చెత్తబుట్టలో వేసినట్లేనని వైకాపా మండల మాజీ అధ్యక్షుడు, తెదేపా నేత బగాది హరి అన్నారు. అయోధ్యపురం పంచాయతీ సర్పంచి ప్రతినిధిగా ఉన్న ఆయన స్థానికంగా ఉపాధి వేతనదారులతో బుధవారం మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భార్యకు టికెట్ ఇస్తే దువ్వాడకు కోపమని అన్నారు. ఆయనకు 60 ఏళ్లు ఉండగా, 30 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని భార్యపిల్లలను గాలికొదిలేసినట్లు ఆయన భార్యే ముఖ్యమంత్రి ఎదుట చెప్పిందన్నారు. కుటుంబాన్ని చూడనివారు ప్రజల్ని ఏం చూస్తారని వ్యాఖ్యానించారు. పలాసలో బొగ్గులు అమ్ముకునేవారని, సంపతిరావు రాఘవరావు అల్లుడిగానే టెక్కలికి పరిచయమయ్యాడని, ఆయన మారని పార్టీ లేదని నిప్పులు చెరిగారు. అయిదు సార్లు పోటీ చేసి ఓడిపోయాడని, ఇప్పుడు కూడా గెలవడని అన్నారు. దువ్వాడ ఎటువంటివాడో ఆయన భార్య, మామ, తమ్ముడి ఫోను నంబర్లు ఇస్తాను అడగండంటూ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, అచ్చెన్నాయుడు హోం మంత్రి అవ్వడం ఖాయమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..