పోలింగ్కు 48 గంటల ముందు కీలకం
పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి సిబ్బంది పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి పేర్కొన్నారు.
మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి, చిత్రంలో కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఇతర అధికారులు
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి సిబ్బంది పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి పేర్కొన్నారు. కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 48 గంటల ముందు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని, అయిదుగురికి మించి ఒక చోట ఉండకూడదన్నారు. ప్రచార సమయం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలవారు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల ఖర్చుల రిజిస్టర్ చివరి దశ తనిఖీలు పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇతర నియోజకవర్గాల వాహనాలు ప్రవేశించకుండా, డబ్బు, మద్యం రవాణా కాకుండా చూడాలన్నారు. రూ.50 వేలకు పైగా నగదు, రూ.10 వేలకు పైగా విలువైన వస్తువులు రవాణా చేస్తే వెంటనే గుర్తించి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, తరలించడం వంటివాటిపై దృష్టి సారించాలన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాత్రి వేళలో ప్రత్యేక నిఘా పెట్టి సీ-విజిల్, 1950 టోల్ ఫ్రీ నంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సమావేశంలో పోలీసు పరిశీలకులు దిగంబర్ ప్రధాన్, సత్యంద్ర పటేల్, నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు సందీప్కుమార్, శరవణ్కుమార్, కోమల్ జిత్ మీనా, నవీన్కుమార్ సోనీ, ఎస్పీ రాధిక పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆక్రమణలకు అడ్డేది.. అడిగేవారేరి..?
[ 19-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అండదండలతో సహజ వనరులు అన్యాక్రాంతమయ్యాయి.. -
అన్నదాతను వీడని గండం..!
[ 19-05-2024]
వంశధార కుడి, ఎడమ కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఏటా కష్టాలు తప్పట్లేదు. గుర్రపుడెక్క రూపంలో గండం వారిని వేధిస్తోంది. -
నంబర్ 1 కుర్రోడు
[ 19-05-2024]
అకుంఠిత దీక్ష.. పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఉత్తమ ఇంజినీర్గా స్థిరపడాలనే ఉద్దేశంతో గమ్యం వైపు పయనిస్తున్నాడు ఈ సిక్కోలు కుర్రాడు. -
స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలి
[ 19-05-2024]
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. -
గోవిందా.. హరి గోవిందా..
[ 19-05-2024]
శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి, నరసన్నపేటలోని వెంకన్న స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.. -
వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు
[ 19-05-2024]
గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం..!
[ 19-05-2024]
పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటు పడుతున్నాయి. -
పారామెడికల్ ఫలితాల్లో ప్రతిభ
[ 19-05-2024]
పారామెడికల్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టాలు తప్పిన ఇంజినీరింగ్ స్పెషల్ రైలు
[ 19-05-2024]
గంజాం జిల్లాలోని ఛత్రపురం-జగన్నాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో శనివారం ఖుర్దావైపు (డౌన్ లైను) వెళుతున్న ఓ ఇంజినీరింగ్ స్పెషల్ రైలు (పట్టాలు, ఇతర సామగ్రి ఉండే రైలు) మూడు చక్రాలు పట్టాలు తప్పాయి. -
విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చూడండి
[ 19-05-2024]
కిర్గిజిస్థాన్లో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు శనివారం లేఖ రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన