విమానాశ్రయంలో విసుగు ఉండదిక!
చెన్నై విమానాశ్రయంలో అత్యాధునికగా కొత్త టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది. గతేడాదే ఇది ప్రయాణికుల కోసం తెరవాల్సిఉండగా.. పలు ఇబ్బందులతో ఆలస్యంగా ముందుకు తెస్తున్నారు.
సిద్ధమైన చెన్నై విమానాశ్రయ కొత్త టెర్మినల్
ట్రయల్రన్లో అధికారులు తలమునకలు
చెన్నై విమానాశ్రయంలో అత్యాధునికగా కొత్త టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది. గతేడాదే ఇది ప్రయాణికుల కోసం తెరవాల్సిఉండగా.. పలు ఇబ్బందులతో ఆలస్యంగా ముందుకు తెస్తున్నారు. నిర్మాణాల హంగులు అన్నీ పూర్తయినట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని ప్రారంభించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈనాడు-చెన్నై
విమానాశ్రయ కొత్త టెర్మినల్ వినూత్న ఇంటీరియర్ డైజైనింగ్తో ముందుకొస్తోంది. ఇందులో ఉన్నవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు ఆధునికత జతకట్టి తీర్చిదిద్దారు. కొత్త టెర్మినల్ లోపల విస్తారంగా స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులు పెద్దసంఖ్యలో వచ్చినా.. దానికి తగ్గట్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన అద్దాలతో తనిఖీ ప్రాంతాన్ని కట్టారు. ఒకేసారి ఆ క్యాబిన్లోకి ఇద్దరు ప్రయాణికులు వెళ్లేలా డిజైన్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఇది అత్యాధునిక వ్యవస్థ అని, క్యూలైన్లను వెంటనే పంపించేందుకు ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారు.
చెక్ ఇన్ ప్రాంతంలో సౌర విద్యుత్తు దీపాల వెలుగులు
వినూత్న టైల్స్
గోడలకు చెక్క, ఇతర టైల్స్ కలిపి వినూత్నంగా తీర్చిదిద్దారు. విపరీత శబ్దాలు ప్రసరించకుండా ఈ తరహా డిజైన్లకు వెళ్లినట్లు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. టెర్మినల్ లోపల నల్ల గ్రానైట్ని విరివిగా వాడారు. అక్కడక్కడ రంగుల గ్రానైట్ డిజైన్లతో ముస్తాబు చేశారు. మొత్తానికి లోపలికొచ్చిన ప్రయాణికులు ఉపశమనం పొందే వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. కొత్త టెర్మినల్ పనులన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం అన్నికోణాల్లో ముగింపు పరీక్షలు జరుగుతున్నాయి. ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
గృహ గుర్తింపు
విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న అధునాత టెర్మినల్కు వినూత్న గుర్తింపు లభించింది. ఈ నిర్మాణాలు పర్యావరణహితంగా ఉన్నాయంటూ ‘గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్మెంట్ (గృహ)’ ఆధ్వర్యంలో 4 స్టార్ రేటింగ్ దక్కింది. విద్యుత్తు ఆదా చర్యలు, వ్యర్థాల నివారణ, హరిత విద్యుత్తు నేపథ్య చర్యలు, రవాణా, సుదీర్ఘకాలంగా మన్నే ప్రయత్నాల నేపథ్యంలో ఈ రేటింగ్ దక్కినట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడి టెర్మినల్ భవనాలతో ఎలాంటి పర్యావరణ ముప్పు లేదని రేటింగ్లో గుర్తింపు ఇచ్చినట్లుగా వెల్లడించారు. విమానాశ్రయంలో ఇప్పటికీ పునర్వినియోగ (రీసైకిల్) నీటిని వాడుతున్నారని, కొత్తగా రూపొందే టెర్మినల్స్లో సౌర వెలుగులు ఏర్పాటు చేస్తున్నారని, వెలుగును బట్టి సెన్సార్ల ద్వారా విద్యుత్తు దీపాలు వెలిగే సౌకర్యాన్ని తెచ్చారని అంటున్నారు.
తరంగం ఆకారంలో టెర్మినల్ పైకప్పు
మెట్రో నుంచే హాయిగా..
విమానాశ్రయం ముందున్న మెట్రో రైల్వేస్టేషన్లోనే చెకిన్ సౌకర్యాన్ని కల్పించి.. ప్రయాణికుల లగేజీని అక్కడే ఎయిర్లైన్స్ వారికి అందజేసే సౌకర్యం కల్పించేలా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఎయిర్లైన్స్ ప్రతినిధులతో, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులతో చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ శరద్కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాల్ని సేకరించారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కమిటీని నియమించబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే.. మెట్రో స్టేషన్ నుంచే ఎలాంటి బ్యాగుల చింతా లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఛార్జింగ్ కేంద్రాలు
విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేసిన దేశంలోనే తొలి విమానాశ్రయంగా చెన్నై గుర్తింపు పొందింది. చెన్నై విమానాశ్రయం, ఇండియన్ ఆయిల్ సంస్థ సంయుక్తంగా కలిసి వీటిని ఏర్పాటుచేశారు. విద్యుత్తు వాహనదారులు మొబైల్ యాప్ ద్వారా, ఆర్ఎఫ్ఐడీ కార్డుల ద్వారా ఛార్జింగ్ సౌకర్యాన్ని పొందేలా ఏర్పాట్లు చేశారు.
పార్కింగ్ సౌలభ్యం
ఎయిర్పోర్ట్ ఆవరణలోనే ఉన్న మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ఈ మధ్యే అందుబాటులోకి వచ్చింది. ఏ తరహా వాహనాలు ఎక్కడ నిలపాలనే విధానాన్ని కూడా అమలుపరుస్తున్నారు. తూర్పువైపు గ్రౌండ్ప్లోర్ నుంచి 5వ అంతస్తు, దానిపై టెర్రస్ భాగం పూర్తిగా విమానాశ్రయ ప్రయాణికుల కార్లకు ఇచ్చారు. పశ్చిమం వైపు పార్కింగ్లో గ్రౌండ్ప్లోర్, 2, 5వ అంతస్తులు, టెర్రస్ పూర్తిగా ప్రయాణికుల కార్లకు ఇచ్చారు. మిగిలిన 1వ అంతస్తు ద్విచక్ర వాహనాలకు, 3వ అంతస్తు విమానాశ్రయ కార్లకు, 4వ అంతస్తు కమర్షియల్ కార్లకు, విమానాశ్రయ కార్లకు ఇచ్చారు. దీన్నిబట్టే రుసుములు తీసుకుంటున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
భద్రతా దళాల నుంచి విమానాశ్రయ అధికారులకు కీలక ఆదేశాలు వచ్చాయి. ఈనెల 30వ తేదీ వరకు విమానాశ్రయంలోపల, బయట కట్టుదిట్టమైన భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ప్రయాణికుల్ని ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ప్రయాణాలు చేసేవారు.. నిర్ణీత సమయానికన్నా ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని సందేశాలు పంపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం