అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
త్రీడీ దృశ్యాలతో సందర్శకుల ఆనందం
వీఆర్, ఏఆర్ దృశ్యాలను త్రీడీలో చూస్తున్న సందర్శకులు
మహాబలిపురం, న్యూస్టుడే: చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పార్క్ను 1972లో ఎకరా విస్తీర్ణంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పారు. ఇక్కడ సర్పాలు, మొసళ్లు, ఊసరవెల్లిలు, తొండలు, ఉడుములు మొదలైన 32 రకాల 300 ప్రాణులు ఉన్నాయి. ఇక్కడున్న 40 ఏళ్ల వయసున్న ఉప్పు నీటి మొసలి, 25 ఏళ్ల వయసున్న దక్షిణ ఆసియా కొండచిలువ ప్రధాన ఆకర్షణ. ఈ కొండ చిలువ 3 సార్లు ఒక్కోసారి 40 గుడ్ల చొప్పున పెట్టి వాటిని పొదిగింది. పార్క్లో పాముల రకాల గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. త్వరలో అనకొండను తీసుకొచ్చి సందర్శనకు ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జాతీయ వన్యప్రాణుల కమిషన్ అనుమతి కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా వన్య ప్రాణులను దగ్గరగా చూసి తాకినట్లు అనుభూతి పొందే విధంగా 3డీ దృశ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో వీఆర్ అనే 3డీ, వర్చువల్ రియాలిటీ షో, డైనోసార్ ప్రపంచం, వన్యప్రాణుల ప్రపంచం మొదలైన షోలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఏదైనా ఒక షోను ఎంపిక చేసుకుని 5 నుంచి 7 నిమిషాల వరకు తిలకించవచ్చు. ఇందుకోసం రూ.100 రుసుము నిర్ణయించారు. అంతేకాకుండా ఏఆర్ అనే 3డీ అగ్మెంటెడ్ రియాలిటీ షోతో వన్య ప్రాణులకు దగ్గరగా నిలబడి తిలకించే సమయంలో అవి మన దగ్గరికి వచ్చినట్లు దృశ్యాలను ఏర్పాటు చేశారు. వీటిని తిలకించడానికి 10 నిమిషాలకు రూ.20 రుసుము వసూలు చేస్తున్నారు.
విద్యార్థుల ఆసక్తి
ఈ సందర్భంగా స్నేక్ పార్క్ డైరెక్టరు అరవళగన్ మాట్లాడుతూ... వన్యప్రాణులు, వాటి జీవనశైలి తెసుకోవడానికి విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, పరిశోధన కోర్సులు చదివే విద్యార్థులు పార్క్కు వస్తున్నారని, ఇక్కడున్న కొన్ని తొండలను పవన్యప్రాణుల మార్పిడి పథకం కింద మరో పార్కుకు అందజేసి అక్కడి అనకొండను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 3డీ సాంకేతికత దృశ్యాలను ప్రవేశపెట్టామని, ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. పార్క్ సందర్శనకు పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.10, ఫొటోలు తీసుకోవడానికి రూ.20, వీడియోలు చిత్రీకరించడానికి రూ.100 వసూలు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ప్రోత్సాహంతో అత్యుత్తమ విజయం
[ 05-05-2024]
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించింది ఆ యువతి. తల్లి ప్రోత్సాహం అండగా నిలిచింది. ప్రజా గ్రంథాలయం తోడ్పాటు అందించింది. -
కాంగ్రెస్ నాయకుడి అనుమానాస్పద మృతి
[ 05-05-2024]
కాంగ్రెస్ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్ ధనసింగ్(60) స్థానిక దిసయన్విలైలో నివాసం ఉంటున్నారు. -
పుదుచ్చేరిలో వడగాల్పులు
[ 05-05-2024]
పుదుచ్చేరిలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడగాల్పులతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. -
నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
[ 05-05-2024]
సముద్రంలో 1.8 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతుండటంతో కన్నియాకుమరి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, రామనాథపురం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
చేపలవేట నిషేధకాలంలో ఆర్థికసాయం పెంచాలి
[ 05-05-2024]
చేపలవేట నిషేధ కాలంలో ఆర్థికసాయం పెంచి ఇవ్వాలని పుదుచ్చేరి అన్నాడీఎంకే కార్యదర్శి అన్బళగన్ కోరారు. శనివారం ముఖ్యమంత్రి రంగసామిని కలిసి వినతిపత్రం అందించారు. -
రసవాతి ఫస్ట్ సింగిల్ విడుదల
[ 05-05-2024]
శాంతకుమార్ దర్శకత్వంలో అర్జున్దాస్, తన్యా రవిచంద్రన్ జంటగా రూపొందిన చిత్రం ‘రసవాతి’. రమ్యా సుబ్రమణియన్, జి.ఎం.సుందర్, సుజిత్ శంకర్, రేష్మా వెంకటేశ్, సుజాత, రిషికాంత్ తదితరులు ఇతర తారాగణం. -
బడిబాట పట్టాల్సిందే!
[ 05-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా చూడటానికి విద్యాశాఖ కొత్త ప్రయత్నం ప్రారంభిస్తోంది. 70వేల మంది వరకు బడి మానేశారని, ఇంకా 3 లక్షల మేరకు అదే జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. -
నాకు సంబంధం లేదు
[ 05-05-2024]
అనుమానాస్పద స్థితిలో మరణించిన కాంగ్రెస్ పార్టీ తిరునెల్వేలి తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి కాంగ్రెస్ శాసనసభ్యుడు రూబి మనోహరన్ పేర్కొన్నారు. -
పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ
[ 05-05-2024]
ఈసీఆర్ రోడ్డులోని ‘తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ముట్టుక్కాడులో పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త డబుల్ డెక్కర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్(నీటిలో తేలియాడే)అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న