కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సిద్ధమవుతున్న సీఎంఆర్ఎల్
విహంగ వీక్షణం
న్యూస్టుడే, వడపళని: మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండో దశలోని అయిదో మార్గంలో కత్తిపార కూడలి గుండా ట్రాక్ నిర్మాణం జరగనుంది. చెన్నై మహానగరంలో కత్తిపార కూడలి వద్ద పలు ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా పైవంతెన ఉంది. ఈ వంతెనపై నిత్యం వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. ఇప్పటికే ఇక్కడ మెట్రో మొదటి దశ మార్గంలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. రెండో దశ 5వ మార్గంలో ఇక్కడ ట్రాక్ నిర్మాణానికి సీఎంఆర్ఎల్ సన్నద్ధమవుతోంది.
ఏఏఐ అనుమతి మేరకే నిర్మాణం
ఈ కూడలిలో రెండో దశలో పనుల కోసం ‘కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ’, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతి తీసుకున్నట్టు సీఎంఆర్ఎల్ అధికారి ఒకరన్నారు. ఈ ప్రాంతంలో విమానాలు చాలా దగ్గరి నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి కావున పిల్లర్ల నిర్మాణ సమయంలో ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పారు. ఏఏఐ అనుమతించిన ఎత్తు వరకే నిర్మాణం కూడా జరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మెట్రో మొదటి దశలో ఉన్న మార్గానికి దగ్గరగా నిర్మాణం జరుగుతుందని, అందుకోసం ‘కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ’ నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో రైళ్లు నడవని సమయంలో అంటే అర్ధరాత్రి నుంచి ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లవారుజాము వరకు పనులు జరుగుతాయని తెలిపారు.
కత్తిపారా కూడలిలో జరుగుతున్న మెట్రో పనులు
రెండో దశలో జరుగుతున్న పనులు పూర్తి కాగానే మాధవరం, అన్నానగర్, విల్లివాక్కం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నగరంలోని దక్షిణ శివారు ప్రాంతాలైన మడిపాక్కం, కీల్కట్టలై, మేడవాక్కం, షోలింగనల్లూరుకు సులువుగా చేరుకోగలరు. నాలుగో మార్గంలో లైట్ హౌజ్ నుంచి పూనమల్లి, మూడో మార్గంలో మాధవరం నుంచి తిరుమయిలై మీదుగా సిప్కాట్ వరకు పనులు వేగంగా సాగుతున్నాయి.
సవాలుతో పనులు
కత్తిపార కూడలిలో మొదటి దశలో ఉన్న మార్గానికన్నా బాగా ఎత్తులో రెండో దశ మార్గం నిర్మాణం కానుంది. నగరంలో పలు ప్రాంతాలకు ప్రధానంగా ఉన్న ఈ పైవంతెన అనేక మలుపులతో కూడి ఉంది. ఇక్కడ 108 అడుగుల ఎత్తైన పిల్లర్పై ట్రాక్ నిర్మాణ పెద్ద సవాలుతో కూడుకుందని సీఎంఆర్ఎల్ అధికారులు పేర్కొంటున్నారు. సమీపంలో ఉన్న విమానాశ్రయానికి విమానాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ఇతర వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ప్రోత్సాహంతో అత్యుత్తమ విజయం
[ 05-05-2024]
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించింది ఆ యువతి. తల్లి ప్రోత్సాహం అండగా నిలిచింది. ప్రజా గ్రంథాలయం తోడ్పాటు అందించింది. -
కాంగ్రెస్ నాయకుడి అనుమానాస్పద మృతి
[ 05-05-2024]
కాంగ్రెస్ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్ ధనసింగ్(60) స్థానిక దిసయన్విలైలో నివాసం ఉంటున్నారు. -
పుదుచ్చేరిలో వడగాల్పులు
[ 05-05-2024]
పుదుచ్చేరిలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడగాల్పులతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. -
నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
[ 05-05-2024]
సముద్రంలో 1.8 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతుండటంతో కన్నియాకుమరి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, రామనాథపురం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
చేపలవేట నిషేధకాలంలో ఆర్థికసాయం పెంచాలి
[ 05-05-2024]
చేపలవేట నిషేధ కాలంలో ఆర్థికసాయం పెంచి ఇవ్వాలని పుదుచ్చేరి అన్నాడీఎంకే కార్యదర్శి అన్బళగన్ కోరారు. శనివారం ముఖ్యమంత్రి రంగసామిని కలిసి వినతిపత్రం అందించారు. -
రసవాతి ఫస్ట్ సింగిల్ విడుదల
[ 05-05-2024]
శాంతకుమార్ దర్శకత్వంలో అర్జున్దాస్, తన్యా రవిచంద్రన్ జంటగా రూపొందిన చిత్రం ‘రసవాతి’. రమ్యా సుబ్రమణియన్, జి.ఎం.సుందర్, సుజిత్ శంకర్, రేష్మా వెంకటేశ్, సుజాత, రిషికాంత్ తదితరులు ఇతర తారాగణం. -
బడిబాట పట్టాల్సిందే!
[ 05-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా చూడటానికి విద్యాశాఖ కొత్త ప్రయత్నం ప్రారంభిస్తోంది. 70వేల మంది వరకు బడి మానేశారని, ఇంకా 3 లక్షల మేరకు అదే జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. -
నాకు సంబంధం లేదు
[ 05-05-2024]
అనుమానాస్పద స్థితిలో మరణించిన కాంగ్రెస్ పార్టీ తిరునెల్వేలి తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి కాంగ్రెస్ శాసనసభ్యుడు రూబి మనోహరన్ పేర్కొన్నారు. -
పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ
[ 05-05-2024]
ఈసీఆర్ రోడ్డులోని ‘తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ముట్టుక్కాడులో పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త డబుల్ డెక్కర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్(నీటిలో తేలియాడే)అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్