నాకు సంబంధం లేదు
అనుమానాస్పద స్థితిలో మరణించిన కాంగ్రెస్ పార్టీ తిరునెల్వేలి తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి కాంగ్రెస్ శాసనసభ్యుడు రూబి మనోహరన్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రూబి మనోహరన్
తిరునెల్వేలి: అనుమానాస్పద స్థితిలో మరణించిన కాంగ్రెస్ పార్టీ తిరునెల్వేలి తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి కాంగ్రెస్ శాసనసభ్యుడు రూబి మనోహరన్ పేర్కొన్నారు. జయకుమార్ పోలీసులకు రాసిన లేఖలో తనను హత్య చేస్తానంటూ బెదిరించారని కొందరి పేర్లను ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో రూబి మనోహరన్ పేరుండటంతో విలేకర్లు ఈ విషయమై ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. జయకుమార్ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. వాస్తవానికి ఆయన మరణం తనకు తీరని లోటుగా ఉందన్నారు. తన అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంతో తమ మధ్య మనస్పర్థలున్నట్లు పేర్కొనడం అబద్ధమన్నారు. కొందరు కుట్రతో తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. అసలు జయకుమార్ పోలీసులకు రాసిన లేఖ నిజమైందేనా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. అందులోని చేతిరాత ఆయనదేనా? అన్న సందేహం వస్తోందన్నారు. ఇదే అనుమానాన్ని కాంగ్రెస్ నేత తంగబాలు కూడా లేవనెత్తారు. జయకుమార్ లేఖలో తన పేరు ఉండడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
400 స్థానాలకు పైగా సాధిస్తాం: తమిళిసై
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. -
‘విడుదలై-2’లో అతిథిగా ఎస్జే సూర్య
[ 18-05-2024]
గత ఏడాది ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ‘విడుదలై’ చిత్రం విడుదలై భారీ విజయం సాధించింది. -
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
[ 18-05-2024]
తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని గాయని సైంధవి అన్నారు. -
బస్సులకేమైంది...?
[ 18-05-2024]
ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణమంటే పలు ప్రాంతాల్లో జనం భయపడే పరిస్థితులున్నాయి. కారణం.. కాలం చెల్లినవాటిని వివిధ రూట్లలో తిప్పుతుండటం, అవి ప్రమాదాలకు గురవుతుండటం. రెండు, మూడేళ్లుగా ఇవి మరిన్ని పెరిగాయి. -
3 రోజులు నీలగిరికి రాకండి: కలెక్టర్
[ 18-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా వేసవి వర్షాలు కురుస్తున్నాయి -
మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్లపై మాట్లాడటం మానేసిన మోదీ
[ 18-05-2024]
దేశంలో మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్ల గురించి మోదీ మాట్లాడటం మానేశారని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై అన్నారు. -
ప్రాంగణ నియామకాల్లో ఐఐటీఎం సత్తా
[ 18-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. -
జపాన్లో భారత రాయబారిగా విళుపురంవాసి
[ 18-05-2024]
జపాన్లో భారత్ రాయబారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. -
వ్యర్థాలను తొలగించండి: జలవనరుల శాఖ
[ 18-05-2024]
కూవం నదిలో నీటి మార్గాలను అడ్డుకునేలా జాతీయ రహదారుల శాఖ ఒప్పంద సంస్థ పోసిన మట్టి, భవన శిథిలాల తొలగింపునకు జలవనరుల శాఖ రూ.50 కోట్లు అడిగింది. -
ఇతరులను గమనించడం నా పనికాదు
[ 18-05-2024]
ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్