logo

నాకు సంబంధం లేదు

అనుమానాస్పద స్థితిలో మరణించిన కాంగ్రెస్‌ పార్టీ తిరునెల్వేలి తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి కాంగ్రెస్‌ శాసనసభ్యుడు రూబి మనోహరన్‌ పేర్కొన్నారు.

Published : 05 May 2024 00:07 IST

ఎమ్మెల్యే రూబి మనోహరన్‌

తిరునెల్వేలి: అనుమానాస్పద స్థితిలో మరణించిన కాంగ్రెస్‌ పార్టీ తిరునెల్వేలి తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి కాంగ్రెస్‌ శాసనసభ్యుడు రూబి మనోహరన్‌ పేర్కొన్నారు. జయకుమార్‌ పోలీసులకు రాసిన లేఖలో తనను హత్య చేస్తానంటూ బెదిరించారని కొందరి పేర్లను ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో రూబి మనోహరన్‌ పేరుండటంతో విలేకర్లు ఈ విషయమై ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. జయకుమార్‌ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. వాస్తవానికి ఆయన మరణం తనకు తీరని లోటుగా ఉందన్నారు. తన అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంతో తమ మధ్య మనస్పర్థలున్నట్లు పేర్కొనడం అబద్ధమన్నారు. కొందరు కుట్రతో తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. అసలు జయకుమార్‌ పోలీసులకు రాసిన లేఖ నిజమైందేనా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. అందులోని చేతిరాత ఆయనదేనా? అన్న సందేహం వస్తోందన్నారు. ఇదే అనుమానాన్ని కాంగ్రెస్‌ నేత తంగబాలు కూడా లేవనెత్తారు. జయకుమార్‌ లేఖలో తన పేరు ఉండడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని