‘విలేజ్ కుకింగ్’ తాత ఆరోగ్యంపై రాహుల్గాంధీ ఆరా
విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్ కుకింగ్ ఛానల్కు 22 మిలియన్ చందాదారులు ఉన్నారు.
సైదాపేట, న్యూస్టుడే: విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్ కుకింగ్ ఛానల్కు 22 మిలియన్ చందాదారులు ఉన్నారు. 2018లో ఈ ఛానల్ను సుబ్రమణియన్, మురుగేశన్, అయ్యనార్, తమిళ్సెల్వన్, ముత్తుమాణిక్కం, పెరియతంబి ప్రారంభించారు. ఈ బృందాన్ని పెరియతంబి నడిపిస్తున్నారు. ప్రకృతి అందంతో కూడిన ప్రాంతాల్లో వంట చేయటంతో ఈ ఛానల్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. తమిళనాడుకు వచ్చిన రాహుల్గాంధీ వారి వంటకాలను రుచి చూసి అభినందించారు. కమల్హాసన్ నటించిన విక్రమ్ సినిమాలోని ఒక సన్నివేశంలో ఈ బృందం కనిపించటంతో మరింత ఆదరణ పెరిగింది. ఈ ఏడాది మార్చిలో పెరియతంబి గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకుని బాగున్నట్లు ఆ బృందానికి చెందిన సుబ్రమణియన్ ఎక్స్ పేజీలో పోస్టు చేశాడు. పెరియతంబి విడుదల చేసిన వీడియోలో.. తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరామర్శించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తమ్ముడు రాహుల్గాంధీ ఫోన్లో తనను సంప్రదించి ఆరోగ్యంపై ఆరా తీశారన్నారు. పూర్తిగా కోలుకుని వస్తానని ధైర్యం చెప్పారని గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
400 స్థానాలకు పైగా సాధిస్తాం: తమిళిసై
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. -
‘విడుదలై-2’లో అతిథిగా ఎస్జే సూర్య
[ 18-05-2024]
గత ఏడాది ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ‘విడుదలై’ చిత్రం విడుదలై భారీ విజయం సాధించింది. -
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
[ 18-05-2024]
తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని గాయని సైంధవి అన్నారు. -
బస్సులకేమైంది...?
[ 18-05-2024]
ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణమంటే పలు ప్రాంతాల్లో జనం భయపడే పరిస్థితులున్నాయి. కారణం.. కాలం చెల్లినవాటిని వివిధ రూట్లలో తిప్పుతుండటం, అవి ప్రమాదాలకు గురవుతుండటం. రెండు, మూడేళ్లుగా ఇవి మరిన్ని పెరిగాయి. -
3 రోజులు నీలగిరికి రాకండి: కలెక్టర్
[ 18-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా వేసవి వర్షాలు కురుస్తున్నాయి -
మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్లపై మాట్లాడటం మానేసిన మోదీ
[ 18-05-2024]
దేశంలో మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్ల గురించి మోదీ మాట్లాడటం మానేశారని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై అన్నారు. -
ప్రాంగణ నియామకాల్లో ఐఐటీఎం సత్తా
[ 18-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. -
జపాన్లో భారత రాయబారిగా విళుపురంవాసి
[ 18-05-2024]
జపాన్లో భారత్ రాయబారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. -
వ్యర్థాలను తొలగించండి: జలవనరుల శాఖ
[ 18-05-2024]
కూవం నదిలో నీటి మార్గాలను అడ్డుకునేలా జాతీయ రహదారుల శాఖ ఒప్పంద సంస్థ పోసిన మట్టి, భవన శిథిలాల తొలగింపునకు జలవనరుల శాఖ రూ.50 కోట్లు అడిగింది. -
ఇతరులను గమనించడం నా పనికాదు
[ 18-05-2024]
ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!