ఒకే పాఠశాల పేరుతో రెండు నీట్ కేంద్రాలు
తంజావూర్, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో తంజావూర్, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి.
పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని
పరీక్ష కేంద్రం వద్ద రిహానా
ఆర్కేనగర్: తంజావూర్, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో తంజావూర్, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ రెండింటిని నీట్ కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టుకోట్టై సమీపం ఊరణికి చెందిన రిహానా.. కుంభకోణం పరీక్ష కేంద్రానికి బదులు తంజావూర్లోని కేంద్రానికి వెళ్లింది. అక్కడి వెళ్లాక విషయం తెలియడంతో వెంటనే కారులో కుంభకోణానికి బయల్దేరింది. మధ్యాహ్నం 1.40 గంటలకు కేంద్రానికి చేరుకుంది. సమయం దాటిపోవడంతో ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేక కన్నీటితో వెనుదిరిగింది. అదేవిధంగా తంజావూర్కు చెందిన మరో విద్యార్థిని తంజావూర్ తామరై కేంద్రానికి వెళ్లగా తనకు కుంభకోణం కేంద్రాన్ని కేటాయించారని తెలిసి ద్విచక్రవాహనంపై వేగంగా 1.25 గంటలకు చేరుకోవడంతో పరీక్ష రాయడానికి అనుమతించారు. ఒకే జిల్లాలో 40 కి.మీ దూరంలో ఒకే పేరుతో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో ఏటా విద్యార్థులు ఇలానే గందరగోళానికి గురై పరీక్షకు దూరమవుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒకే కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
కుటుంబ గొడవలతో మరో యువతి...
ఆర్కేనగర్: కుటుంబ గొడవల కారణంగా నీట్ రాయాల్సిన విద్యార్థిని గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పత్తూర్ జిల్లా పుదూర్ ప్రాంతానికి చెందిన కమల్నాథన్, ఇలక్కియ భార్యాభర్తలు. వీరికి 18 ఏళ్ల కుమార్తె ఉంది. కమల్నాథన్ అక్క మణిమేఘలై కుమారులైన కోదండన్ (33), మోహన్కుమార్ (30) తరచూ మేనమామ కుమార్తెతో గొడవపడుతుండేవారు. ఇదిలా ఉండగా శనివారం మళ్లీ యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కమల్నాథన్.. వారిని మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మేనమామ, అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీని గురించి బాధిత యువతి మాట్లాడుతూ.. తాను నీట్కు కష్టపడి చదివానని, కుటుంబ గొడవ కారణంగా పరీక్షకు దూరమయ్యాయని, నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులకేమైంది...?
[ 18-05-2024]
ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణమంటే పలు ప్రాంతాల్లో జనం భయపడే పరిస్థితులున్నాయి. కారణం.. కాలం చెల్లినవాటిని వివిధ రూట్లలో తిప్పుతుండటం, అవి ప్రమాదాలకు గురవుతుండటం. రెండు, మూడేళ్లుగా ఇవి మరిన్ని పెరిగాయి. -
3 రోజులు నీలగిరికి రాకండి: కలెక్టర్
[ 18-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా వేసవి వర్షాలు కురుస్తున్నాయి -
మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్లపై మాట్లాడటం మానేసిన మోదీ
[ 18-05-2024]
దేశంలో మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్ల గురించి మోదీ మాట్లాడటం మానేశారని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై అన్నారు. -
ప్రాంగణ నియామకాల్లో ఐఐటీఎం సత్తా
[ 18-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. -
జపాన్లో భారత రాయబారిగా విళుపురంవాసి
[ 18-05-2024]
జపాన్లో భారత్ రాయబారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. -
400 స్థానాలకు పైగా సాధిస్తాం: తమిళిసై
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. -
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు
[ 18-05-2024]
గత ఏడాది ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ‘విడుదలై’ చిత్రం విడుదలై భారీ విజయం సాధించింది. -
వ్యర్థాలను తొలగించండి: జలవనరుల శాఖ
[ 18-05-2024]
కూవం నదిలో నీటి మార్గాలను అడ్డుకునేలా జాతీయ రహదారుల శాఖ ఒప్పంద సంస్థ పోసిన మట్టి, భవన శిథిలాల తొలగింపునకు జలవనరుల శాఖ రూ.50 కోట్లు అడిగింది. -
ఇతరులను గమనించడం నా పనికాదు
[ 18-05-2024]
ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్