logo

పోలండ్‌ యువతిని పెళ్లాడిన కృష్ణగిరి యువకుడు

కృష్ణగిరి జిల్లా వేప్పన్‌హళ్లి సమీపం కురియనప్పళ్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ కుమారుడు రమేష్‌ (33) ఉన్నత విద్య కోసం పోలండ్‌ వెళ్లాడు.

Published : 06 May 2024 01:42 IST

ఎవలినా మేత్రా, రమేష్‌ పెళ్లి దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కృష్ణగిరి జిల్లా వేప్పన్‌హళ్లి సమీపం కురియనప్పళ్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ కుమారుడు రమేష్‌ (33) ఉన్నత విద్య కోసం పోలండ్‌ వెళ్లాడు. అక్కడి యూఎస్‌ఏ విల్లనోవా అనే యూనిర్సిటీలోని పరిశోధన విభాగంలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో ఆ దేశ యువతి ఎవలినా మేత్రా (30)తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తమిళ సంప్రదాయం ప్రకారం యువకుడి స్వగ్రామంలో పెళ్లి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని