తాగునీరు అందించనున్న తిరునిండ్రవూరు చెరువు
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రభుత్వానికి జలమండలి ప్రతిపాదనలు
న్యూస్టుడే, వడపళని: స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రూ.100 కోట్లతో నివేదిక
తిరునిండ్రవూరు చెరువు 349 హెక్టార్లలో చెన్నై నగరానికి పశ్చిమంగా ఉంది. మురుగు నీరు, ఆక్రమణలతో కుచించుకుపోయింది. దీనికితోడు ఏళ్ల తరబడి పూడికతీత పనులు కూడా జరగలేదు. గతంలో తాగునీటి అవసరాలకు పోరూరు, రెట్టేరి, నెమం, అయనంబాక్కం చెరువులను వినియోగించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద నీటిని నియంత్రించి, తిరునిండ్రవూరు చెరువులో సమృద్ధిగా నీటిని నిల్వ చేసేందుకు రూ.100 కోట్లతో సమగ్ర నివేదికను జలమండలి విభాగం ప్రభుత్వ ఆర్థిక విభాగానికి పరిశీలనార్థం పంపింది.
500 ఎంసీఎఫ్టీలకు పెంచే యోచన
ఈ చెరువులో నీటి సామర్థ్యాన్ని 150 నుంచి 500 మిలియన్ క్యూబిక్ అడుగుల వరకు పెంచుకునే వీలుందని జలమండలి విభాగ అధికారులు పేర్కొన్నారు. చెరువులో 1.50 మీటర్ల వరకు చెత్తాచెదారాలు పేరుకుపోయాయని, మురుగు శుభ్రం చేసి ఆక్రమణలు తొలగించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయని చెప్పారు. చేపట్టనున్న ప్రాజెక్టుతో ఆదాయం కూడా సమకూరనుంది. చెరువు నుంచి 30 లక్షల క్యూబిక్ మీటర్ల కోర్స్ సాయిల్ (సవుడు)ను తొలగించి దాని ద్వారా రూ.36 కోట్ల మేరకు ఆదాయాన్ని గడించే వీలుంది. వరదలు సంభవించినప్పుడు పెరియార్ నగర్, ముత్తమిళ్ నగర్, తిరునిండ్రవూరు పరిసరాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ‘తమిళనాడు అర్బన్ హ్యాబిటెట్ డెవలప్మెంట్ బోర్డ్’ (టీఎన్యూహెచ్డీబీ) చెరువుకు సమీపంలోని మత్తమిళ్ నగర్, కన్నికాపురం, పెరియార్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లను ఏర్పాటు చేసిందని, చెరువులో నీరు నిండినప్పుడు ఈ ప్రాంతాలన్నీ నీటమునిగి ఉంటాయని అధికారులు గమనించారు. 4.8 కి.మీ వరకు చెరువును, తీరం వద్ద బలోపేతం చేసి, నీటిని నియంత్రించేందుకు షట్టర్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా జలమండలి విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
శాశ్వత వనరుగా...
ప్రస్తుతం ఆవడి మున్సిపల్ కార్పొరేషన్కు చెన్నై మెట్రో వాటర్ నుంచి అధిక మొత్తంలో తాగునీరు సరఫరా అవుతోంది. తిరునిండ్రవూరు చెరువును శాశ్వతంగా తాగునీటి సరఫరాకు అనుగుణంగా తీర్చిదిద్దితే ఆవడి, పరిసర ప్రాంతవాసులకు ఉపయోగకరంగా ఉండగలదు. పూండి జలాశయంలో అధికంగా చేరుకునే నీటిని పూండి - చెంబరంబాక్కం లింకు కాలువ ద్వారా తిరునిండ్రవూరు చెరువుకు తరలించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. దీంతో చెరువులో నీటి నిల్వ కూడా పెరుగుతుందని, కొంత నీటిని చెన్నైకి కూడా సరఫరా చేసే వీలుంటుందని ఓ అధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
400 స్థానాలకు పైగా సాధిస్తాం: తమిళిసై
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. -
‘విడుదలై-2’లో అతిథిగా ఎస్జే సూర్య
[ 18-05-2024]
గత ఏడాది ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ‘విడుదలై’ చిత్రం విడుదలై భారీ విజయం సాధించింది. -
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
[ 18-05-2024]
తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని గాయని సైంధవి అన్నారు. -
బస్సులకేమైంది...?
[ 18-05-2024]
ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణమంటే పలు ప్రాంతాల్లో జనం భయపడే పరిస్థితులున్నాయి. కారణం.. కాలం చెల్లినవాటిని వివిధ రూట్లలో తిప్పుతుండటం, అవి ప్రమాదాలకు గురవుతుండటం. రెండు, మూడేళ్లుగా ఇవి మరిన్ని పెరిగాయి. -
3 రోజులు నీలగిరికి రాకండి: కలెక్టర్
[ 18-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా వేసవి వర్షాలు కురుస్తున్నాయి -
మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్లపై మాట్లాడటం మానేసిన మోదీ
[ 18-05-2024]
దేశంలో మూడోదశ ఎన్నికల తర్వాత 400 సీట్ల గురించి మోదీ మాట్లాడటం మానేశారని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై అన్నారు. -
ప్రాంగణ నియామకాల్లో ఐఐటీఎం సత్తా
[ 18-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. -
జపాన్లో భారత రాయబారిగా విళుపురంవాసి
[ 18-05-2024]
జపాన్లో భారత్ రాయబారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. -
వ్యర్థాలను తొలగించండి: జలవనరుల శాఖ
[ 18-05-2024]
కూవం నదిలో నీటి మార్గాలను అడ్డుకునేలా జాతీయ రహదారుల శాఖ ఒప్పంద సంస్థ పోసిన మట్టి, భవన శిథిలాల తొలగింపునకు జలవనరుల శాఖ రూ.50 కోట్లు అడిగింది. -
ఇతరులను గమనించడం నా పనికాదు
[ 18-05-2024]
ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!