విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!
విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
సన్నాహాల్లో పార్టీలు
వేళచ్చేరి, న్యూస్టుడే: విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 7వ దశలో జూన్ 1న జరిగే ఎన్నికలతోపాటు విక్రవాండి అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్కు తెలియజేసింది.ఏ సమయంలోనైనా ఉప ఎన్నిక తేదీ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. మంగళవారం(7న) నోటిఫికేషన్ వెలువడవచ్చని రాజకీయపార్టీలు ఎదురుచూస్తున్నాయి. 4 నుంచి అగ్నినక్షత్రం ప్రారంభమై ఎండలు మరింత పెరిగాయని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఉప ఎన్నిక తేదీ ప్రకటించాలని పీఎంకే అధ్యక్షుడు రామదాసు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు ప్రకటించినా పోటీకి రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి.
ఆశావహుల యత్నాలు..
పీఎంకే అన్నాడీఎంకే కూటమి నుంచి బయటికొచ్చినందున తమకు అనుకూలంగా ఉంటాయని డీఎంకే భావిస్తోంది. ఆ పార్టీ నుంచి బరిలో నిల్చేందుకు విళుపురం జిల్లాలో అనేక మంది ఆశావహులు పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తున్నారు. విళుపురం జిల్లా పంచాయతీ అధ్యక్షుడు జయచంద్రన్, విక్రవాండి యూనియన్ కార్యదర్శి వేంబి రవి, మృతి చెందిన ఎమ్మెల్యే పుహళేంది కోడలు ప్రసన్నదేవి సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
- అన్నాడీఎంకేలో యూనియన్ కార్యదర్శి ఎస్ఆర్ఎం పన్నీర్, జనరల్ బాడీ కమిటీ మాజీ సభ్యుడు లక్ష్మీనారాయణన్ సహా అనేక మంది ప్రయత్నిస్తున్నారు.
- పీఎంకే తరఫున పోటీకి జిల్లా పార్టీ అధ్యక్షుడు పుహళేందికి అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఏజీ సంపత్ కూడా టికెట్ ఆశిస్తున్నారని, ప్రస్తుతం ఆయన భాజపాలో ఉన్నందున పీఎంకే మద్దతుతో పోటీ చేయొచ్చని భాజపా నిర్వాహకులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుషులకు ప్రత్యేక తిరునాల
[ 19-05-2024]
మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల శనివారం వైభవంగా జరిగింది. -
చిరుధాన్యం.. చక్కటి పోషకం
[ 19-05-2024]
సంప్రదాయ వంటకాల రుచే వేరు. వాటితో కలిగే ఆరోగ్యం.. అమోఘం. ఇప్పటికీ ఈ తరహా ఆహారం ముందంజలో ఉంటూ వస్తోంది. మారుతున్న ఆహార అలవాట్లు, సులువుగా దొరికే ఫాస్ట్ఫుడ్పై మోజు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాలు పాడవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. -
అవాస్తవ ప్రచారం తగదు: ముఖ్యమంత్రి స్టాలిన్
[ 19-05-2024]
విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. -
కోవైలో కుండపోత
[ 19-05-2024]
కోయంబత్తూరులో శనివారం కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయమవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన ఆలందురై, సెమ్మెడు, గౌండంపాళ్యంలో మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో ఆ ప్రాంతవాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
కంచిలో జాతీయ సదస్సు
[ 19-05-2024]
కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. -
ప్రధాని మోదీ బయోపిక్లో సత్యరాజ్?
[ 19-05-2024]
ప్రధాని మోదీ బయోపిక్లో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన నటించిన వెప్పన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. -
రాధికను పరామర్శించిన శివకుమార్
[ 19-05-2024]
కాలుకు దెబ్బతగిలి కోలుకుంటున్న రాధికను సీనియర్ నటుడు శివకుమార్ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చేలా ఆయన గీసిన పెయింటింగ్స్ రాధికకు ఇచ్చారు. -
వైభవంగా వాసవి జయంతి మహోత్సవం
[ 19-05-2024]
జార్జిటౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 19-05-2024]
శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. -
ఉద్యోగం పేరుతో నగదు మోసం
[ 19-05-2024]
చెన్నై వళసరవాక్కానికి చెందిన శరవణన్ భార్య సెంతమిళ్ అరిసి (31) ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతకసాగింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఉన్నట్లు వచ్చిన ప్రకటనలు చూసి అందులో ఉన్న ఫోన్ నెంబరుకి కాల్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..