పిరందనాళ్ వళ్తుక్కళ్ ఫస్ట్లుక్ విడుదల
సుశీంద్రన్ దర్శకత్వంలోని ‘వెణ్ణిలా కబడ్డీ కుళు’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు శివబాలన్ అలియాస్ అప్పుకుట్టి.
ఫస్ట్లుక్ పోస్టరు విడుదల చేస్తున్న విజయ్సేతుపతి
చెన్నై, న్యూస్టుడే: సుశీంద్రన్ దర్శకత్వంలోని ‘వెణ్ణిలా కబడ్డీ కుళు’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు శివబాలన్ అలియాస్ అప్పుకుట్టి. ఆయన ప్రస్తుతం కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పిరందనాళ్ వాళ్తుక్కళ్’. మంగళవారం అప్పుకుట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను నటుడు విజయ్ సేతుపతి తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిత్రానికి కథ, దర్శకత్వం రాజు చంద్ర. ప్లాన్ థ్రి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రోజీ మాథ్యూ, రాజు చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ చిత్ర నటి ఐశ్వర్య అనిల్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్కు నాయికగా పరిచయం కానున్నారు. శ్రీజ రవి, రోజీ మాథ్యూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్పుకుట్టి తన పుట్టినరోజు సందర్భంగా నిరాదరణకు గురైన మహిళలు, వృద్ధులు ఉండే ఆశ్రమాల్లో భోజనం అందించారు.
‘13’ చిత్రం డబ్బింగ్ ప్రారంభం
డబ్బింగ్ చెప్తున్న జీవీ ప్రకాశ్
చెన్నై: మెడ్రాస్ స్టూడియోస్ పతాకంపై కె.వివేక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘13’. ఇందులో జీవీ ప్రకాశ్కుమార్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పనులు 80 రోజులు చెన్నై, అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం చిత్రీకరణ పనులు పూర్తై డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 13.13 గంటలకు జీవీ ప్రకాశ్ డబ్బింగ్ చెప్పి పనులు ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా చిత్రం రూపొందిందని, ప్రేక్షకులను కుర్చీల చివర కూర్చోబెట్టేంత ఉత్కంఠభరితంగా ఉంటుందని దర్శకుడు వివేక్ తెలిపారు. సినిమా కథ విభిన్నంగా ఉందని, తప్పక విజయం సాధిస్తుందని జీవీ ప్రకాశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. డార్లింగ్ చిత్రం తర్వాత తాను నటించిన హారర్ చిత్రం ఇదని, ప్రేక్షకులను తప్పకుండా కొత్త అనుభూతికి గురిచేస్తుందని తెలిపారు.
‘పడిక్కాద పక్కంగళ్’ పోస్టరు...
చెన్నై: సెల్వం మాదప్పన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడిక్కాద పక్కంగళ్’. మాతృత్వం, స్త్రీతత్వం కథావస్తువుగా రూపొందిన ఈ చిత్రంలో యాషిక ఆనంద్ ప్రధానపాత్ర పోషించారు. ప్రజిన్, జార్జి మర్యన్, ముత్తుకుమార్, బాలాజీ, లొల్లుసభ మనోహర్ తదితరులు ఇతర నటీనటులు. రానున్న 17న చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది.
‘రసవాతి’కి యు/ఏ సర్టిఫికెట్
చెన్నై: శాంతకుమార్ దర్శకత్వంలో అర్జున్దాస్, తన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రసవాతి’. ఇందులో రమ్యా సుబ్రమణియన్, జీఎం సుందర్, సుజిత్ శంకర్, రేష్మా వెకంటేశ్, సుజాత, రిషికాంత్ తదితరులు ఇతర నటీనటులు. రానున్న 10న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో కొన్ని రోజుల కిందట విడుదలైన ట్రైలర్ యూట్యూబ్లో ఇప్పటివరకు 30 లక్షల వ్యూస్ను దాటింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ ధ్రువపత్రం అందించినట్టు చిత్రబృందం వెల్లడించింది.
‘స్టార్’కు యు...
చెన్నై: ఇళన్ దర్శకత్వంలో కవిన్ హీరోగా నటించిన చిత్రం ‘స్టార్’. లాల్, గీతా కైలాసం, అతిథి, ప్రీతి ముకుందన్ తదితరులు ఇతర నటీనటులు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం రానున్న 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం సెన్సార్ వివరాలను చిత్రబృందం విడుదల చేసింది. చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ అందించినట్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుషులకు ప్రత్యేక తిరునాల
[ 19-05-2024]
మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల శనివారం వైభవంగా జరిగింది. -
చిరుధాన్యం.. చక్కటి పోషకం
[ 19-05-2024]
సంప్రదాయ వంటకాల రుచే వేరు. వాటితో కలిగే ఆరోగ్యం.. అమోఘం. ఇప్పటికీ ఈ తరహా ఆహారం ముందంజలో ఉంటూ వస్తోంది. మారుతున్న ఆహార అలవాట్లు, సులువుగా దొరికే ఫాస్ట్ఫుడ్పై మోజు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాలు పాడవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. -
అవాస్తవ ప్రచారం తగదు: ముఖ్యమంత్రి స్టాలిన్
[ 19-05-2024]
విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. -
కోవైలో కుండపోత
[ 19-05-2024]
కోయంబత్తూరులో శనివారం కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయమవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన ఆలందురై, సెమ్మెడు, గౌండంపాళ్యంలో మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో ఆ ప్రాంతవాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
కంచిలో జాతీయ సదస్సు
[ 19-05-2024]
కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. -
ప్రధాని మోదీ బయోపిక్లో సత్యరాజ్?
[ 19-05-2024]
ప్రధాని మోదీ బయోపిక్లో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన నటించిన వెప్పన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. -
రాధికను పరామర్శించిన శివకుమార్
[ 19-05-2024]
కాలుకు దెబ్బతగిలి కోలుకుంటున్న రాధికను సీనియర్ నటుడు శివకుమార్ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చేలా ఆయన గీసిన పెయింటింగ్స్ రాధికకు ఇచ్చారు. -
వైభవంగా వాసవి జయంతి మహోత్సవం
[ 19-05-2024]
జార్జిటౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 19-05-2024]
శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. -
ఉద్యోగం పేరుతో నగదు మోసం
[ 19-05-2024]
చెన్నై వళసరవాక్కానికి చెందిన శరవణన్ భార్య సెంతమిళ్ అరిసి (31) ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతకసాగింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఉన్నట్లు వచ్చిన ప్రకటనలు చూసి అందులో ఉన్న ఫోన్ నెంబరుకి కాల్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM