మాజీ ఎమ్మెల్యే వేలాయుధన్ కన్నుమూత
తమిళనాడు భాజపా ఎమ్మెల్యే వేలాయుధన్(73) మృతి చెందారు. 1996 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పోటీచేశారు. కన్నియాకుమరి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేలాయుధన్ గెలుపొందారు.
ప్యారిస్, న్యూస్టుడే: తమిళనాడు భాజపా ఎమ్మెల్యే వేలాయుధన్(73) మృతి చెందారు. 1996 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పోటీచేశారు. కన్నియాకుమరి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేలాయుధన్ గెలుపొందారు. భాజపా తరఫున మొట్టమొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2001, 2006లో పోటీ చేసినా విజయం వరించలేదు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు వహించిన ఆయన 2006 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని ఆర్ఎస్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామాలయ నిర్మాణానికి సంతకాల ఉద్యమం నిర్వహించారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం మృతిచెందారు. పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సొంతూరైన కరుప్పుక్కోడులో గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కొన్నేళ్ల కిందట మృతి చెందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
-
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే