Vizag: బీచ్కు ఎలా వెళ్లింది.. గర్భిణి మృతి కేసులో ఎన్నో అనుమానాలు
నగరంలోని ఆర్కే బీచ్లో మంగళవారం అర్ధరాత్రి తరువాత శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) ఐదు నెలల గర్భిణి.
ఈనాడు-విశాఖపట్నం: నగరంలోని ఆర్కే బీచ్లో మంగళవారం అర్ధరాత్రి తరువాత శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) ఐదు నెలల గర్భిణి. ఏడాది క్రితం గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం పెద నడుపూరు ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జి. మణికంఠతో వివాహం అయింది. ప్రాథమికంగా ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నప్పటికీ... మృతదేహం దొరికిన తీరుబట్టి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు బీచ్ వద్దకు ఎలా వెళ్లింది? ఎవరైనా తోడు వెళ్లారా? అనే కోణంలో సీసీ ఫుటేజీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బీచ్లో ఏ ప్రదేశం వద్దకు వెళ్లారు? ఏ సమయంలో చేరుకున్నారు? ఎంత సేపు గడిపారు? అనే కోణంలో ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంటి నుంచి మంగళవారం రాత్రి 7.30 గంటలకు నీలి రంగు గౌను ధరించి వెళ్లినట్లు కుటుంబీకులు, స్థానికులు చెబుతున్నారు. బీచ్లో రాత్రి 10-11 గంటల వరకు సందడిగానే ఉంటుంది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. పైగా బీచ్ పెట్రోలింగ్, రక్షక్ టీం, బీచ్ గార్డ్స్ సంచరిస్తూ ఉంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యకు యత్నిస్తే తెల్లవారుజామున 2 గంటలకే మృతదేహం వెలుగులోకి రావడం, ఇసుకలో కూరుకుపోవడం, ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉండటం వంటివి ప్రశ్నలుగా మారాయి. ఒంటిపై గాయాల్లేవని పోలీసులు చెబుతుండగా, పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. గురువారం పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. బీచ్ సమీపంలో ఇటీవల గంజాయి ముఠాలు హడావుడి ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
కడుపులో బిడ్డ కోసమైనా ఆలోచించాల్సింది: ‘మంగళవారం సాయంత్ర 6.15గంటలకు ఫోన్ చేసి మాట్లాడింది. చాలా వరకు సర్దిచెప్పాను. కుటుంబంలో చిన్న,చిన్న సమస్యలొస్తాయని, సర్దుకు పోవాలని కోరాను. కనీసం కడుపులోని బిడ్డ కోసం ఆలోచించినా బాగుండేది. ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడే స్విచ్ ఆఫ్ చేసింది. తొందరపాటు వద్దంటూ ఎన్నో మెసేజ్లు పెట్టాను. న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాను. ఇంతలోనే ఈ దారుణం జరిగింది’ అని శ్వేత భర్త మణికంఠ పేర్కొంటున్నారు.
సివిల్స్కు సన్నద్ధమవుతానంది..
‘నా కూతురు గుణం, అందంలో లక్ష్మీదేవి. బీటెక్ చదివిన శ్వేత సివిల్స్కు సన్నద్ధం అవుతానంది. పెళ్లైన తర్వాత చదివించకుండా వంటింటికి పరిమితం చేశారు. శ్వేత అత్తది నటన. అత్త, ఆడపడుచు కడుపుతో ఉన్న అమ్మాయిని హింసలు పెట్టారు. నెల రోజుల క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను బెదిరించారు. మంగళవారం కూడా ఫోన్ చేసి అత్త ఇంటిలో ఇబ్బందులు చెప్పింది. ఇంటికి వచ్చేయమని చెప్పాను. వరకట్నం కోసం శ్వేతను వేధించేవారు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం చాల్లేదని, ఇంకా తేవాలని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేశారు. పెళ్లి సమయంలో రూ.10లక్షల కట్నం ఇవ్వగా, మరో రూ.లక్ష లాంఛనాల కింద ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారన్నారు. కూతురులా చూసుకుంటామని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టారు’ అని శ్వేత తల్లి రమ విలపించారు. ఈమేరకు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై సంతోష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాల్లేవని ఈస్ట్ ఏసీపీ వివేకానంద తెలిపారు. సముద్రంలో గల్లంతైన వ్యక్తులు ఇసుకలో కూరుకుపోవడం సహజంగా జరుగుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ