కోతలు.. వాతలు..!
గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిపోతుంది. ఎమెర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) పేరుతో కాకుండా సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఎడాపెడా కోతలు విధిస్తున్నారు.
గ్రామాల్లో అప్రకటిత విద్యుత్తు కోతలు
బిల్లుల్లో అదనపు ఛార్జీల బాదుడు
ఈనాడు, పాడేరు - న్యూస్టుడే, పాయకరావుపేట గ్రామీణం, కశింకోట, కె.కోటపాడు, మునగపాక
గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిపోతుంది. ఎమెర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) పేరుతో కాకుండా సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. నగర ప్రాంతంలో సరఫరాకు ఇబ్బందుల్లే కున్నా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు. సమయపాలన లేకుండా రాత్రిళ్లు కూడా విద్యుత్తు కోతలు అమలు చేయడంతో పల్లెవాసులకు కంటి మీద కునుకు కరవవుతోంది. మరోవైపు విద్యుత్తు బిల్లుల్లో ట్రూఅప్, ఇంధన కొనుగోలు ఛార్జీలంటూ అదనపు వడ్డింపులు విధిస్తూ వినియోగదారులకు భారీగా వాతలు పెడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల కేటగిరీ విద్యుత్తు కనెక్షన్లు 17 లక్షల వరకు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో రోజుకు 28 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. ఈ ఏడాది జూన్లో రోజుకు 32 మిలియన్ యూనిట్లు దాటిపోతోంది. సోమవారం అత్యధికంగా రికార్డుస్థాయిలో 34.1 మి.యూ వినియోగం నమోదైంది. గతేడాదితో పోల్చితే రోజుకు నాలుగైదు మిలియన్ యూనిట్ల వాడకం పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో విద్యుత్తు వినియోగం అమాంతంగా పెరిగింది. దీంతో సరఫరాలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరగడంతో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల లోవోల్టేజీ సమస్యతో నెట్టుకురావాల్సి వస్తోంది.
వెతలు ఎన్నో..
* పాయకరావుపేట మండలంలోని సత్యవరం, గుంటపల్లి, అరట్లకోట, మాసాహెబ్పేట తదితర ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్తు సరఫరాలోనూ కోతపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేతికి అందొచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటున్నారు. తమలపాకు తోటకు నీరుపెట్టడానికి జనరేటర్ను అద్దెకు తెచ్చి పెట్టుకున్నామని రెండు రోజులకు రూ.7 వేలు ఖర్చయిందని సత్యవరానికి చెందిన ఓ రైతు చెప్పారు.
* కశింకోట మండలంలో వేళాపాళ లేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతోపాటు రైస్ మిల్లులు, పిండి మిల్లులు పనిచేయక వాటి ముందు బస్తాలు పేరుకుపోతున్నాయి. కోతల వల్ల మోటార్లు పనిచేయక గ్రామాలలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. వ్యవసాయ మోటార్లు పనిచేయకపోవడంతో తోటలు నీరందక ఎండుతున్నాయి. తీడ, చెరకాం, అడ్డాం, మోసయ్యపేట, కచ్చర్లపాలెంలో కరెంటు కోతల ప్రభావం ఎక్కువగా ఉంది.
* కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామాన్ని తరుచూ చీకట్లు అలముకుంటున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడ కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు. లో ఓల్టేజీ సమస్యలూ ఉన్నాయి. విద్యుత్తు సమస్యలను పరిష్కరించడానికి చౌడువాడలో ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని సర్పంచి ఎరుకునాయుడు సీఎండీకి ఇదివరకు వినతి పత్రం అందించారు.
వడ్డింపు ఇలా..
ఇప్పటికే విద్యుత్తు బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీలు పేరిట వసూళ్లు చేస్తున్నాయి. తాజాగా గతేడాది విద్యుత్తు కొనుగోళ్లుకు సంబంధించి ఇంధన, విద్యుత్తు కొనుగోలు ఛార్జీలు (ఎఫ్పీపీసీఏ)ను యూనిట్కు 19 పైసల నుంచి గరిష్ఠంగా 65 పైసలు చొప్పున వసూళ్లు చేయడం మొదలుపెట్టాయి. గత నెల నుంచే ఈ అదనపు ఛార్జీలను బిల్లుల్లో కలిపి ఇస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో మొదటి మూడు నెలలు (ఏప్రిల్ నుంచి జూన్) 19.75 పైసలు, తర్వాత జులై నుంచి సెప్టెంబర్ వరకు 61.94 పైసలు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 56.52 పైసలు, 2024 జనవరి నుంచి మార్చి వరకు 65 పైసలు చొప్పున యూనిట్కు లెక్కించి బిల్లింగ్ చేస్తారు. మొదటి మూడు నెలలు ఉమ్మడి జిల్లాలో వినియోగదారుల నుంచి సుమారు రూ.36 కోట్ల మేర ముక్కుపిండి వసూలు చేయనున్నారు.
చిన్న గాలివీచినా కరెంటు నిలిపేస్తున్నారు
-మారిశెట్టి అప్పలనాయుడు, రైతు, మునగపాక
చిన్న గాలి వీచినా ముందుగా వ్యవసాయ విద్యుత్తు నిలిపేస్తున్నారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యవసాయ విద్యుత్తు సరఫరా చేయాలి. వారంలో రెండుమూడు రోజులు కూడా సక్రమంగా ఇవ్వడంలేదు.
కోతలు ఎక్కడా లేవు..
- మహేంద్రనాథ్, ఎస్ఈ, ఈపీడీసీఎల్
విద్యుత్తు కోతలను ఎక్కడా అమలు చేయడం లేదు. కరెంటు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనివల్ల కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించి సరిచేస్తున్నాం. వ్యవసాయ విద్యుత్తుకు అంతరాయం లేకుండా చూస్తున్నాం. గాలుల సమయంలో స్తంభాలు పడిపోవడం.. వైర్లు ట్రిప్ అవ్వడం జరుగుతుంటుంది. అందువల్లే ముందుజాగ్రత్తగా కొంత సమయం కరెంటు ఆపుతుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ