‘కాగితం’పైనే డిప్యుటేషన్ల రద్దు!
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు.
వైద్యారోగ్యశాఖలో అధికారుల తీరుపై విమర్శలు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు. దీని ప్రకారం ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఇచ్చిన ఆదేశాలు ‘కాగితానికే’ పరిమితమయ్యాయి. వాటిని ప్రిన్సిపల్ సెక్రటరీకి మాత్రమే పంపారని, సదరు ఉద్యోగులకు పంపకుండా కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా ఉద్యోగులు ఇప్పటికీ డిప్యుటేషన్పై తమకు నచ్చిన ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు.
వివిధ ఆసుపత్రుల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ శాతం నగరంలో స్థిరపడ్డారు. గతంలో వారంతా గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు. దీంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో డిప్యుటేషన్లు వేయించుకున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు గతంలో ఆర్డీ కార్యాలయంలోని అధికారికి కొంత మొత్తం చెల్లించారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇటీవల డిప్యుటేషన్లు రద్దు చేయడంతో కొందరు పాత ఆసుపత్రులకు వెళ్లిపోయారు. మరికొందరు ఇప్పటికీ నగరంలోనే పనిచేసేలా అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు తెలిసింది. ఇలా డీఎంహెచ్వో కార్యాలయంలోనే 10 మందికి పైగా పనిచేస్తున్నారని సమాచారం.
ఆదేశించినా.. వెళ్లట్లేదు: రాంబిల్లి పీహెచ్సీ నుంచి ఓ సీనియర్ అసిస్టెంట్ ఏడాది క్రితం డిప్యుటేషన్పై విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)కు వచ్చారు. పీహెచ్సీలో పని ఒత్తిడి దృష్ట్యా తిరిగి వచ్చేయాలని గతంలోనే ఆయనను ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ కొంత కాలం ఇక్కడే ఉంచేలా విమ్స్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడున్న జూనియర్ అసిస్టెంట్లకు పనినేర్పేందుకు వచ్చారని, శిక్షణ పూర్తి కాగానే వెళ్లిపోతారంటున్నారు. వాస్తవానికి ఏడాదిగా ఆయన ఎవరికీ శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. రాంబిల్లి పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆఫీసర్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది సూపరింటెండెంట్గా వచ్చిన ఒకరు నెల రోజుల్లోనే డిప్యుటేషన్పై విమ్స్కు వెళ్లిపోయారు. ఆయన బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూస్తున్నారు. డిప్యుటేషన్ రద్దయినా ఇంకా విమ్స్లోనే పనిచేస్తున్నారు.
- శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని ఓ పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్ ఆర్డీ కార్యాలయంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. వారంలో మూడు రోజులు పీహెచ్సీలో, మరో మూడు రోజులు ఆర్డీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. డిప్యుటేషన్లు రద్దయినా ఆయన వారానికి మూడు రోజులు మాత్రమే పీహెచ్సీకి వెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చంద్రబాబే ముఖ్యమంత్రి!.. ఫలితాల తర్వాత వైకాపా కాలగర్భంలోకి..’
[ 22-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. -
నీటి సరఫరాలో గోల్‘మాల్’..!
[ 22-05-2024]
మండు వేసవిలో ప్రజలు తాగునీటికి అల్లాడుతుంటే అధికారులు మాత్రం ఓ భారీ మాల్కు నిత్యం లక్షల లీటర్ల నీటిని అనధికారికంగా తరలిస్తున్నారు. దీని కోసం కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా సమయాన్ని తగ్గించేశారనే విమర్శలొస్తున్నాయి. -
భారీ గోతులు.. నిత్య వెతలు!!
[ 22-05-2024]
విశాఖ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో గాజువాకలోని ఆటోనగర్ పారిశ్రామికవాడ మార్గమొకటి. ఆటోనగర్ ప్రవేశ ద్వారం వద్ద రహదారిని చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. -
తొలుత బ్యాలట్.. తర్వాత ఈవీఎం ఓట్లు..!
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 13న జరిగిన పోలింగ్లో జిల్లా వ్యాప్తంగా 70.02శాతం చొప్పున 14,09,118 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
మానవ అక్రమ రవాణా మూలాల ఛేదనకు ప్రత్యేక బృందాలు: సీపీ
[ 22-05-2024]
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కాంబోడియాలోని ఏజెన్సీలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న అంశంపై మరింత లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద..భద్రత పరిశీలన
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ మల్లికార్జున మంగళవారం పరిశీలించారు. -
దువ్వాడ పూర్వ సీఐపై కేసు నమోదు
[ 22-05-2024]
దువ్వాడ పోలీస్స్టేషన్లో గతంలో పని చేసిన సీఐ బి.శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. మంగళవారం దువ్వాడ ప్రస్తుత సీఐ ఎర్రన్నాయుడు తెలిపిన వివరాలివి. -
అప్పన్న ఆలయంలో నేడు నృసింహ జయంతి
[ 22-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. -
త్వరలో రైతులకు గుర్తింపు కార్డుల జారీ
[ 22-05-2024]
జనవరి నెలలో ఎంపిక చేసిన రైతులకు త్వరలో గుర్తింపుకార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి యాసిన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు: కేఏ పాల్
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. -
ఉక్కు కార్మికులకు సగం వేతనాలు చెల్లింపు
[ 22-05-2024]
ఉక్కు కార్మికులకు ఏప్రిల్ నెలకు సంబంధించి సగం వేతనాలను మంగళవారం చెల్లించారు. ఆ వివరాలు... మే నెల 21 రోజులు గడిచిపోయినా వేతనాల చెల్లింపులు లేకపోవడంతోఆగ్రహించిన కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
చెరువు మట్టి.. తవ్వుకుంటే అడిగేదెవరేటి?
[ 22-05-2024]
చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మట్టి అమ్మకాల ద్వారా సొమ్ములు వెనకేసుకుంటున్నారు. -
బైకును ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 22-05-2024]
జాతీయ రహదారిపై ఉద్దండపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. -
రికార్డుల్లేని వాహనాల స్వాధీనం
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.