చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి.
ఎలమంచిలి, న్యూస్టుడే: ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. ఇక్కడ చీకటి గదుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ లేకపోవడంతో బ్యాలెట్పై గుర్తులు కనిపించక అవస్థలు పడ్డారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు కలిపి ఎలమంచిలిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు సరిగాలేవని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక టెంట్ వేసి సరిపెట్టారని ఇది హెల్ప్డెస్క్కు సరిపోయిందని, మిగిలిన వారు ఎండలో నిలబడాల్సి వచ్చిందని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉండే ఓటర్లకు, స్థానిక నియోజకవర్గంలో ఉండే ఓటర్లకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అనుభవం ఉన్న వారిని నియమించకపోవడం వల్ల పోలింగ్ నెమ్మదిగా సాగింది. చాలా మంది ఓటుకోసం తహసీల్దార్ కార్యాలయల్లో తమ పత్రాలు సమర్పించినా వారికి ఓటు రాలేదు. దీంతో వీరందరినీ మళ్లీ కొత్తగా పోస్టల్ బాలెట్కు దరఖాస్తు చేసుకోమన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. చివరిలో పోలింగ్ విధుల ఆర్డర్లు వచ్చిన వారు ఇక్కడ ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నారు. విలేకరులను పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతించకపోయినా పార్టీ నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను మాత్రం ఫోన్లతో సహా లోపలికి అనుమతించారు. ఎన్నికల పరిశీలకులు ఈ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
చిరంజీవిని కలిసిన గంటా
[ 19-05-2024]
భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్లో సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
కీలక పోరు.. ఓటర్ల జోరు
[ 19-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. -
ఎన్నికల ఖర్చులకు రూ.12 కోట్లు విడుదల
[ 19-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.12 కోట్లు విడుదల చేసింది. -
పోలింగులో యువ వెల్లువ
[ 19-05-2024]
ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి వెల్లువలా తరలివచ్చారు. -
ఓట్ల గణనకు 14 టేబుళ్లు.. 800మందికి పైగా సిబ్బంది
[ 19-05-2024]
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం’
[ 19-05-2024]
సింహాచలం దేవస్థానం తొలిసారిగా ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సును అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో సత్తా
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఎప్సెట్ ఫలితాలలో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో