ఉచితమే అనుకుంటే.. ఉపద్రవం తప్పదు..
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు పార్టీల అభ్యర్థులు. మన రాష్ట్రంలో పాటు గోవా, తదితర రాష్ట్రాల్లో తయారు చేసిన నాసిరకం, కల్తీ మద్యాన్ని ఇచ్చి ఓటర్లకు ఎర వేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల్లో కల్తీ, నాసిరకం మద్యం పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు
అవి తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు
నాయకుల ఎరకు ఓటర్లు లొంగొద్దని నిపుణుల హెచ్చరిక
న్యూస్టుడే, పెందుర్తి, వేపగుంట, సబ్బవరం, పరవాడ
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు పార్టీల అభ్యర్థులు. మన రాష్ట్రంలో పాటు గోవా, తదితర రాష్ట్రాల్లో తయారు చేసిన నాసిరకం, కల్తీ మద్యాన్ని ఇచ్చి ఓటర్లకు ఎర వేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాసిరకం మద్యం తాగిన పలువురు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తులు, పొట్ట, దీర్ఘకాలిక గొంతు సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో వారంతా ఆసుపత్రుల పాలవడంతో పాటు బతికున్నంత కాలం ఔషధాలు వాడాల్సి రావడంతో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయి. తీవ్రమైన మద్యం అలవాటున్న వారు అకాల మరణానికి గురై కుటుంబ సభ్యులను నట్టేట ముంచుతున్నారు.
కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..
- గజ్జి నర్సింగరావు, గుల్లేపల్లి
మా సమీప బంధువు ఒకతను మద్యానికి అలవాటు పడ్డాడు. మద్యం రేట్లు పెరగడంతో తక్కువ ధరకు వస్తుందని నాసి రకం మద్యం తాగడంతో గుండెల్లో మంట పుట్టి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు. ప్రస్తుతం అతని భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో మగ దిక్కులేక ఇబ్బంది పడుతున్నారు. సంపాదన లేక కుటుంబం రోడ్డున పడింది. పిల్లలను చదివించుకోవడం కూడా ఆమెకు భారంగా మారింది.
మానసిక సమస్యలతో సతమతం
- డాక్టర్ పవన్కుమార్ కంపల్లి, న్యూలైఫ్ పునరావాస కేంద్రం
మద్యం అలవాటున్న వారిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. పునరావాస కేంద్రాలకు వచ్చే వారిలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మద్యం అలవాటు వలన కుటుంబాల్లో అశాంతి రేగుతోంది. సమయపాలన లేకుండా తాగేవారిలో మెదడు ప్రభావితమై మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొంతమంది అనూహ్యంగా ప్రవర్తిస్తున్నారు.
చీప్ లిక్కర్ విషంతో సమానం
- డాక్టర్ ఎన్.ఎస్.ఆర్ చక్రవర్తి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్బవరం
శరీర అలసటను తగ్గించుకునేందుకు చాలామంది మద్యం తాగుతున్నారు. మత్తు కారణంగా శరీర అలసట తగ్గినట్లు అనిపించినా అది నెమ్మదిగా విషంలా పని చేస్తుంది. చిప్ లిక్కర్ తాగడం వల్ల వెంటనే దాని ప్రభావం కనిపిస్తుంది. దీర్ఘకాలంలో వారి నాడీ వ్యవస్థ చెడిపోయే ప్రమాదం ఉంది. నిద్ర లేమి ఏర్పడి అనేక ఇబ్బందులకు గురవుతారు. మద్యాన్ని వీలైనంత తొందరగా మానేయాలి.
కాలేయ బాధితులే అధికం
- డాక్టర్ అన్నాబత్తుల సతీశ్, ఎండీ, పల్మనాలజిస్టు
నాసిరకం మద్యం తాగడం వల్ల కాలేయ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. ఆసుపత్రులకు వచ్చే మద్యం అలవాటున్న వారిలో ఇలాంటి సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామందిలో ఛాతీ సంబంధిత అనారోగ్యం కూడా కనిపిస్తోంది. మద్యంలో స్పిరిట్ మోతాదు అధికంగా ఉండడం వల్ల ఉదర సంబంధిత రోగాలు కూడా పెరిగిపోతాయి.
మళ్లీ అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది..
- ఎం.జ్యోతి, ప్రహ్లాదపురం
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న నాసిరకం, నకిలీ మద్యం కారణంగా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గ్రామాల్లో సైతం విచ్చల విడిగా బెల్టుషాపులు వెలియడంతో వాడకం విపరీతంగా పెరిగింది. మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, కుటుంబాలకు ఆసరా లేకుండా పోతోంది. ఎన్నికల్లో ఉచితంగా మద్యం పంచడం వల్ల ఇదివరకే మానేసిన వారు సైతం మళ్లీ అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది.
మహిళల జీవితాలతో ఆడుకోవద్దు..
- కె.తులసీ సునందన, ప్రహ్లాదపురం
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడి కావడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. చాలా మంది యువత మృతి చెందడంతో పాటు కొంతమంది దివ్యాంగులుగా మారి వారి తల్లిదండ్రులకు భారమవుతున్నారు. నా స్నేహితురాలి తండ్రి కూడా అలాగే మరణించారు. మగ దిక్కులేక కుటుంబం రోడ్డున పడింది. ఎన్నికల్లో నకిలీ మద్యం పంచి మహిళల జీవితాలతో ఆడుకోవద్దు.
నిజాయతీగా ఓటు వేయండి..
- జి.మహేశ్, అప్పికొండ
రోజంతా కాయకష్టం చేసి సంపాదించిన డబ్బును కొంతమంది మద్యానికే ఖర్చు చేస్తున్నారు. తాగకపోతే మరుసటి పని చేయలేమని చెబుతున్నారు. వారి ఇళ్ల వద్ద మహిళలు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. నాసి రకం మద్యం తాగి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. పేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల్లో పంచే మద్యానికి బానిస కాకుండా నిజాయతీగా ఓటు వేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
[ 20-05-2024]
కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. -
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
[ 20-05-2024]
ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు. -
మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!
[ 20-05-2024]
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. -
సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!
[ 20-05-2024]
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు. -
వైకాపా నాయకుడి దౌర్జన్యంపై ఫిర్యాదు
[ 20-05-2024]
పప్పుశెట్టిపాలెం సర్పంచి భర్త వైకాపా నాయకుడు రామకృష్ణ నాయుడు తమపై దౌర్జన్యం చేశారని తెదేపా మండల కమిటీ సభ్యుడు బెల్లం కొండలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం
[ 20-05-2024]
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. -
రెచ్చిపోతే చిక్కులే..
[ 20-05-2024]
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్రూమ్ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది. -
కిక్కిరిసిన తీరం
[ 20-05-2024]
ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఆకట్టుకున్న నాటికలు
[ 20-05-2024]
అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. -
రెండవ రోజు కొనసాగిన చందనం అరగదీత
[ 20-05-2024]
వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM