అనర్హులు 19,996 మంది ?
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఆపై దాటితే లబ్ధిదారులు బిల్లు కట్టాలి. రాయితీ విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా డిస్కంలకు చెల్లిస్తుంది. ఈ కేటగిరీలో అనర్హులు ఎక్కువ
200 యూనిట్ల లోపు వాడే లబ్ధిదారులపై సర్వే
ఎస్ఈ పి.నాగేశ్వరరావు
గంటస్తంభం, న్యూస్టుడే: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఆపై దాటితే లబ్ధిదారులు బిల్లు కట్టాలి. రాయితీ విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా డిస్కంలకు చెల్లిస్తుంది. ఈ కేటగిరీలో అనర్హులు ఎక్కువ శాతం మంది లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు, ఆదాయ పరిమితికి మించిన వారు లబ్ధి ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఎంత మంది, వారు ఎక్కడ నివసిస్తున్నారు, వారిలో ఉద్యోగాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? పట్టణాల్లో నివసించే వారు ఎంతమంది? గ్రామాల్లో ఉంటున్నవారు ఎందరు? వంటి వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా అనర్హులను గుర్తించి వారికి నెలవారీ బిల్లింగు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ విజయనగరం సర్కిల్ పరిధిలో సర్వే చేయాలని సచివాలయాల్లోని ఎనర్జీ సహాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ఆ కనెక్షన్లపై ఆరా
ఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 6,57,698 గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 200 యూనిట్లలోపు వాడుతున్న ఎస్సీల సర్వీసులు 58,354, ఎస్టీల కనెక్షన్లు 42,569 ఉన్నాయి. ప్రభుత్వం ఎస్సీల రాయితీకి ఏటా రూ.10.95 కోట్లు, ఎస్టీలకు రూ.5.19 కోట్లు భరిస్తోంది. ఇది వరకు లబ్ధిదారులు ఎక్కడున్నా కులధ్రువీకరణ పత్రంతో పాటు, ఆదాయ పత్రం, ఆధార్, వినియోగదారుని విద్యుత్తు బిల్లు, బియ్యం కార్డు వంటివి సమర్పిస్తే లబ్ధి చేకూర్చేవారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఏడాదికి పట్టణాల్లో రూ.1.44 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.22 లక్షలు ఆదాయ పరిమితి విధించారు. తాజాగా 19,996 మంది అనర్హులు ఉన్నారనే అనుమానంతో ఆరా తీస్తున్నారు.
నివాస ప్రాంతంతో సంబంధం లేదు
లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లోనే నివాసం ఉండాలన్న నిబంధన ఏమీ రాలేదు. ఉద్యోగులు, ఇతర అనర్హతలున్న వారు 30 శాతానికి పైగా లబ్ధి పొందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నాం. లబ్ధిదారులు ఎక్కడ నివాసం ఉన్నా ఫర్వాలేదు. వారి అర్హతకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పిస్తే చాలు. రాయితీ వర్తిస్తుంది.
- పి.నాగేశ్వరరావు, ఎస్ఈ, ఈపీడీసీఎల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!