పది తప్పినా పట్టభద్రుల ఓటు!
కనీస విద్యార్హత డిగ్రీ ఉంటేనే పట్టభద్రుల ఓటరుగా అవకాశం కల్పిస్తారు. కానీ బొబ్బిలి నియోజకవర్గంలో పదో తరగతి, ఇంటర్ తప్పిన వారితో పాటు నిరక్షరాస్యుల పేర్లు ముసాయిదా జాబితాలో పొందుపర్చడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తప్పుల తడకగా ముసాయిదా జాబితా
ఆకుల చిన్నంనాయుడు విద్యార్హత.. ఇంటర్
* రామభద్రపురం మండలం మామిడివలసకు చెందిన ఆకుల చిన్నంనాయుడును ఓటరుగా నమోదు చేసి విద్యార్హత ఇంటర్గా, శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన మీసాల అప్పలరాజుకు పదో తరగతిగా చూపించారు. రామభద్రపురంలో యజ్జల ప్రతాప్కుమార్ పదో తరగతి ఫెయిల్గా, కె.సంతోష్, ఆర్.చంటిలను నిరక్షరాస్యులుగా నమోదు చేసి ఓటు కల్పించారు.
* ఓటరు జాబితాలో పలువురు ఓటర్ల విద్యార్హత గురించి ఆ కాలమ్లో చూపలేదు. తెర్లాం మండలంలో సీరియల్ నం. 388లో చప్ప మధుకు విద్యార్హత చూపలేదు. నం.265లో సుధీర్ పేరు ఎదుట ఏమీ పేర్కొనలేదు.
న్యూస్టుడే, బొబ్బిలి
కనీస విద్యార్హత డిగ్రీ ఉంటేనే పట్టభద్రుల ఓటరుగా అవకాశం కల్పిస్తారు. కానీ బొబ్బిలి నియోజకవర్గంలో పదో తరగతి, ఇంటర్ తప్పిన వారితో పాటు నిరక్షరాస్యుల పేర్లు ముసాయిదా జాబితాలో పొందుపర్చడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బొబ్బిలిలో పోలింగ్ కేంద్రం నంబర్లు 85, 86, 87, 88లోని జాబితాల్లో తప్పిదాలు కనిపించాయి. కొంతమంది ఓటర్లు పట్టభద్రులుగా నమోదు కాలేదు. మరికొందరికి విద్యార్హత చూపలేదు. ఇక కొందరి చిరునామాలు కూడా సక్రమంగా లేవు. ఇది ఎలా జరిగిందో అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి. జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కె.విజయగౌరి అన్నారు. అర్హత లేని వారిని ఓటర్లుగా చేర్చారని, జాబితాలను సవరించకుంటే ఆందోళన చేస్తామని విలేకరులతో అన్నారు.
ఉన్నతాధికారులకు తెలిపాం
ఇది ముసాయిదా మాత్రమే. ఎక్కడ లోపాలు ఉన్నా సవరించేందుకు చర్యలు తీసుకుంటాం. పోలింగ్ కేంద్రాలు 85, 86, 87, 88 పరిధిలో ఆన్లైన్ ద్వారా 1368, ఆఫ్లైన్లో 3273 వచ్చాయి. వీటిని నివేదించగా ముసాయిదాలో 4479 ఓట్లుగా చూపించారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశాం.
ఎన్.రాజారావు, తహసీల్దారు, బొబ్బిలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!