1,896 పింఛన్ల రద్దు
ఉమ్మడి జిల్లాలో పలువురు పింఛనుదారులకు అధికారులు షాకిచ్చారు. గతంలో లబ్ధి పొందిన వారిలో ఏకంగా 1,896 మంది పింఛన్లను రద్దు చేశారు. వీరు ఈనెలలో లబ్ధి పొందలేదు.
రాకోడులో వివరాలు సేకరిస్తున్న సంక్షేమ సహాయ కార్యదర్శి
విజయనగరం మయూరికూడలి, బెలగాం, రాజాం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో పలువురు పింఛనుదారులకు అధికారులు షాకిచ్చారు. గతంలో లబ్ధి పొందిన వారిలో ఏకంగా 1,896 మంది పింఛన్లను రద్దు చేశారు. వీరు ఈనెలలో లబ్ధి పొందలేదు. వచ్చేనెల నాటికి సరైన అర్హత పత్రాలు చూపిస్తే.పరిశీలించి, ఎంపిక చేయనున్నారు. మిగిలినవారికి యథావిధిగా బుధవారం నగదును అందించనున్నారు.
నోటీసులిచ్చి..
ఉమ్మడి జిల్లాలో రెండు నెలల కిందటి వరకు 4,09,011 మంది లబ్ధిపొందేవారు. ఆరు దశల పరిశీలనలో భాగంగా వీరిలో విజయనగరంలో 4,829, పార్వతీపురం మన్యంలో 2,450 మందికి నోటీసులిచ్చారు. అధికంగా భూమి ఉండడం, విద్యుత్తు బిల్లు ఎక్కువగా రావడం, నాలుగు చక్రాల వాహనం, ఆదాయపు పన్ను చెల్లింపు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగం చేయడం తదితర అంశాలను పరిశీలించి, ఆమేరకు 21 రోజుల్లో వాటికి సమాధానం ఇవ్వాలని సూచించారు. నిజంగా అర్హులైతే అసలు ధ్రువపత్రాలను సచివాలయాల ద్వారా అందించాలి. అయితే చాలామంది ముందుకు రాలేదని, దీంతో కొందరిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై డీఆర్డీఏ విజయనగరం పీడీ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నామని, ఇంకా ఎవరైనా అర్హులుంటే పత్రాలతో రావాలని కోరారు. విజయనగరం జిల్లాలో ఈనెలలో 2,80,912 మందికి రూ.76.12 కోట్లు అందజేయనున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.