logo

వైకాపా నుంచి తెదేపాలోకి 440 కుటుంబాలు

తెదేపాలో చేరికలు కొనసాగుతున్నాయి. నగరంలో శుక్రవారం 37, 48 డివిజన్ల నుంచి 440 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

Published : 04 May 2024 03:00 IST

పార్టీలో చేరిన వారితో అదితి గజపతిరాజు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపాలో చేరికలు కొనసాగుతున్నాయి. నగరంలో శుక్రవారం 37, 48 డివిజన్ల నుంచి 440 కుటుంబాలు తెదేపాలో చేరాయి. 37వ డివిజన్‌కు చెందిన వైకాపా నాయకులు నామన శ్రీనివాసరావు, రెడ్డిపల్లి అప్పలరాజు, పల్లంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 40 కుటుంబాలవారు, 48వ డివిజన్‌లో వైకాపా నాయకులు రాంబార్కి బుజ్జి, కృష్ణకుమారి, కోట్ల తాతారావు, నడిపల్లి సూరిబాబు ఆధ్వర్యంలో 400 కుటుంబాల వారు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని అదితి గజపతిరాజు కండువాలు వేసి, ఆహ్వానించారు.  నాయకులు ఐవీపీ.రాజు, ప్రసాదుల వరప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, అవనాపు విజయ్‌, పిళ్లా విజయకుమార్‌, కంది మురళీనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని