logo

చంద్రబాబుతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సాలూరు నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

Updated : 05 May 2024 14:42 IST

మక్కువ: చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సాలూరు నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం మక్కువ మండలంలో వెంకంపేట, కన్నంపేట గ్రామాల్లో మండలాధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైకాపా పాలనలో మండలం, నియోజకవర్గం అభివృద్ధి జరిగలేదని, సొంత మండలానికి రోడ్లు వేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ తెదేపా అధ్యక్షులు పెంట తిరుపతిరావు, కన్నంపేట మాజీ సర్పంచి బలగ రామకృష్ణ, ఎంపీటీసీ దొడ్డి సాయిబాబు, సాలూరు, గజపతినగరం నియోజకవర్గ జనసేన సమన్వకర్తలు గేదెల రిషివర్ధన్, మర్రాపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని