logo

జగన్‌ మళ్లీ వస్తే మీ భూములు మాయం

జగన్‌కు మరొక అవకాశం ఇస్తే భూములన్నీ మాయమవుతాయని, ప్రజల ఆస్తులు, పత్రాలు ఆయన దగ్గరే పెట్టుకుంటారని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు ఆరోపించారు.

Published : 06 May 2024 03:43 IST

తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌ మాట్లాడుతున్న అశోక్‌, చిత్రంలో అదితి

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: జగన్‌కు మరొక అవకాశం ఇస్తే భూములన్నీ మాయమవుతాయని, ప్రజల ఆస్తులు, పత్రాలు ఆయన దగ్గరే పెట్టుకుంటారని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు ఆరోపించారు. ఒక్క ఛాన్స్‌ అని అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో దెబ్బతీశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిని అదితి గజపతిరాజుతో కలిసి ఆదివారం రాత్రి గ్రామీణ మండలంలోని సారిక, చిల్లపేట, జొన్నవలసలో పర్యటించారు. రూ.లక్షల కోట్లు దోచేసిన వ్యక్తి సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పారు. అతనికి ఇవే చివరి ఎన్నికలన్నారు. ప్రజలందరూ ఆలోచించి బంగారు భవిష్యత్తునిచ్చే నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేగా అదితి గజపతిరాజును గెలిపించాలన్నారు. నాయకులు బొద్దుల నర్సింగరావు, ఈశ్వరరావు, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని