సుదీర్ఘ ఉద్యమ ఫలితం..!
సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు జిల్లాలో మల్లంపల్లి కొత్త మండలం ఏర్పాటు కానుండటంతో..
మల్లంపల్లి మండలం ఏర్పాటుకు గెజిట్ విడుదల
సంబరాల్లో పాల్గొన్న తాతాల్కిక జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి, గ్రామస్థులు
ములుగు, న్యూస్టుడే: సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు జిల్లాలో మల్లంపల్లి కొత్త మండలం ఏర్పాటు కానుండటంతో.. ఆ ప్రాంత వాసుల కల నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. ఇప్పటి వరకు నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఈ ప్రాంత వాసుల శనివారం రాత్రి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మూడు రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామ పంచాయతీలతో కొత్త మండలం ఆవిర్భవించబోతోంది.
ఏళ్ల నాటి కల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల విభజనకు ముందు నుంచే మల్లంపల్లిని మండలం చేయాలని ఆ ప్రాంత వాసులు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలతో పాటు నిరాహార దీక్షలు చేశారు. జరిగిన ఎన్నికల్లో మల్లంపల్లి మండలం ఒక అంశంగా మారగా, హామీలతోనే కాలం గడిచిపోయింది. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే లక్ష్యంతో ప్రజలు కదిలారు. ఎదోవిధంగా వారి ఆకాంక్షను వెలిబుచ్చారు. మల్లంపల్లి మండలాన్ని తప్పకుండా సాధిస్తామని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ సైతం ఛాలెంజ్ చేశారు. ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం మరుగున పడింది. మల్లంపల్లి మండలం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అనేక మండలాలు, రెవెన్యూ గ్రామాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనా మల్లంపల్లి ప్రస్తావన రాలేదు. ఎన్నికల సమయాన్ని అదనుగా భావించి డిమాండును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఎలాగైనా మండలాన్ని సాధించాలనే లక్ష్యంతో ఐక్య కార్యాచరణ పేరుతో కమిటీని వేసుకొని ఉద్యమానికి సిద్ధమయ్యారు.
పంచాయతీలు ఇవీ..
మండలం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ గ్రామాలు, పంచాయతీలు, వాటి పరిధిలోని జనాభా తదితర అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాలు వాటి పరిధిలోని శ్రీనగర్, భూపాల్నగర్, శివతండా, మహ్మద్గౌస్పల్లి, దేవనగర్, ముద్దునూరు తండా, గుర్తూరు తండా, కొడిళలకుంటలతో పాటు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధి కాట్రపల్లి రెవెన్యూ గ్రామంతో పాటు నూర్జాన్పల్లి, సాదన్పల్లి, రాజుపల్లి గ్రామాలు మల్లంపల్లి మండలం పరిధిలోకి రానున్నాయి. ఈ గ్రామాలతో మండలం చేసేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు, హనుమకొండ జిల్లాల కలెక్టర్లను అభ్యంతరాల స్వీకరణకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. అన్ని పంచాయతీ ప్రజల సమ్మతితోనే మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిన దృష్ట్యా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- ములుగు మండలంలో ఇప్పటి వరకు 32 పంచాయతీలున్నాయి. కొత్తగా మల్లంపల్లి మండలం చేయడంతో ములుగు మండలం పరిధిలోని 10 పంచాయతీలు తగ్గనుండగా, 22 పంచాయతీలతో ములుగు మండలం పరిమితం కానుంది. 14 పంచాయతీలతో మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. ఆత్మకూరు, శాయంపేట, నల్లబెల్లి సరిహద్దు మండలాలుగా ఏర్పడనున్నాయి.
జిల్లాలో పది మండలాలు
ఇప్పటి వరకు తొమ్మిది మండలాలకే పరిమితమైన ములుగు జిల్లా ఇక నుంచి 10 మండలాలతో విస్తరించనుంది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం సరసన మల్లంపల్లి మండలం చేరనుంది.
కుసుమ జగదీశ్వర్ పేరుతో..
మండలం ఏర్పాటు అనేది మాజీ జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ కలగా మిగిలిపోవడంతో.. ఆయన పేరుతో మండలం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
- మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 17,768 మంది జనాభా ఉన్నారు.
2014 నుంచి పోరాటం
- చందా కుమారస్వామి, మల్లంపల్లి సర్పంచి
2014 నుంచి మండలం సాధించేందుకు ఉద్యమం సాగిస్తున్నాం. మల్లంపల్లి దాని చుట్టుపక్కల 36 గ్రామాల ప్రజలు మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను వేడుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ మండలాన్ని ప్రకటించారు. కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, హరీశ్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ కవిత, రెడ్కో ఛైర్మన్ సతీష్రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు, ప్రస్తుత తాత్కాలిక జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతిలకు కృతజ్ఞతలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళ్లు లేకున్నా విధులకు..
[ 30-11-2023]
రెండు కాళ్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లాకు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారు. -
ఉచ్చులో ఎలుగుబంటి
[ 30-11-2023]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్కు తరలించారు. -
ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్!
[ 30-11-2023]
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. -
నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి
[ 30-11-2023]
ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. -
నేడే ఓట్ల పండగ
[ 30-11-2023]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నెలన్నర రోజులపాటు సాగిన అభ్యర్థుల ప్రచార హోరు ముగిసి.. వారి జాతకాలను తేల్చే పోలింగ్ రోజు రానే వచ్చింది. -
నియమావళి పాటించాల్సిందే!
[ 30-11-2023]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. అందుకే పారదర్శకంగా వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి ఓటేసి బయటకొచ్చే వరకు అధికారులకు ఓటర్లు సహకరించాలి. -
సాంకేతిక నిఘా.. పర్యవేక్షణ పక్కాగా!
[ 30-11-2023]
పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఆయా కేంద్రాల్లో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఉండేందుకు ప్రతి అంశాన్ని దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్కాస్టింగ్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రండి ఓటేద్దాం..
[ 30-11-2023]
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. -
మన భవిష్యత్తు మన చేతుల్లోనే..
[ 30-11-2023]
యువ ఓటర్లకు ఓటు ప్రాముఖ్యాన్ని తెలపాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు పోశాల భార్గవి, భవ్య ముందుకొచ్చారు. -
అంధుల కోసం.. ప్రత్యేకం
[ 30-11-2023]
ఎన్నికల్లో అందరికి ఓటేసే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది. వృద్ధులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేసి.. వారు ఇంటి వద్దే ఓటేసే సదుపాయం కల్పించింది. -
రామక్కా.. గుర్తుంచుకో..
[ 30-11-2023]
నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్ బూత్ గుర్తుంచుకో రామక్కా -
చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!
[ 30-11-2023]
ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. -
ఏజెంట్లు కీలకం!
[ 30-11-2023]
పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. -
ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు
[ 30-11-2023]
మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను వాడుతున్నారు. -
జీవితకాలంలో..సినిమాలకు 630 గంటలు.. ఓటుకు 15 గంటలే
[ 30-11-2023]
అయిదేళ్లకు ఒకసారి శాసనసభ, పార్లమెంటుతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఓటు హక్కు వచ్చిన వారు అయిదేళ్లకాలంలో సగటుగా మూడు సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు. -
పోలింగ్కు వేళాయే..!
[ 30-11-2023]
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బావించాక మూడోసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది, -
ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి
[ 30-11-2023]
ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


తాజా వార్తలు (Latest News)
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు