సుదీర్ఘ ఉద్యమ ఫలితం..!
సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు జిల్లాలో మల్లంపల్లి కొత్త మండలం ఏర్పాటు కానుండటంతో..
మల్లంపల్లి మండలం ఏర్పాటుకు గెజిట్ విడుదల
సంబరాల్లో పాల్గొన్న తాతాల్కిక జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి, గ్రామస్థులు
ములుగు, న్యూస్టుడే: సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు జిల్లాలో మల్లంపల్లి కొత్త మండలం ఏర్పాటు కానుండటంతో.. ఆ ప్రాంత వాసుల కల నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. ఇప్పటి వరకు నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఈ ప్రాంత వాసుల శనివారం రాత్రి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మూడు రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామ పంచాయతీలతో కొత్త మండలం ఆవిర్భవించబోతోంది.
ఏళ్ల నాటి కల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల విభజనకు ముందు నుంచే మల్లంపల్లిని మండలం చేయాలని ఆ ప్రాంత వాసులు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలతో పాటు నిరాహార దీక్షలు చేశారు. జరిగిన ఎన్నికల్లో మల్లంపల్లి మండలం ఒక అంశంగా మారగా, హామీలతోనే కాలం గడిచిపోయింది. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే లక్ష్యంతో ప్రజలు కదిలారు. ఎదోవిధంగా వారి ఆకాంక్షను వెలిబుచ్చారు. మల్లంపల్లి మండలాన్ని తప్పకుండా సాధిస్తామని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ సైతం ఛాలెంజ్ చేశారు. ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం మరుగున పడింది. మల్లంపల్లి మండలం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అనేక మండలాలు, రెవెన్యూ గ్రామాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనా మల్లంపల్లి ప్రస్తావన రాలేదు. ఎన్నికల సమయాన్ని అదనుగా భావించి డిమాండును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఎలాగైనా మండలాన్ని సాధించాలనే లక్ష్యంతో ఐక్య కార్యాచరణ పేరుతో కమిటీని వేసుకొని ఉద్యమానికి సిద్ధమయ్యారు.
పంచాయతీలు ఇవీ..
మండలం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ గ్రామాలు, పంచాయతీలు, వాటి పరిధిలోని జనాభా తదితర అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాలు వాటి పరిధిలోని శ్రీనగర్, భూపాల్నగర్, శివతండా, మహ్మద్గౌస్పల్లి, దేవనగర్, ముద్దునూరు తండా, గుర్తూరు తండా, కొడిళలకుంటలతో పాటు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధి కాట్రపల్లి రెవెన్యూ గ్రామంతో పాటు నూర్జాన్పల్లి, సాదన్పల్లి, రాజుపల్లి గ్రామాలు మల్లంపల్లి మండలం పరిధిలోకి రానున్నాయి. ఈ గ్రామాలతో మండలం చేసేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు, హనుమకొండ జిల్లాల కలెక్టర్లను అభ్యంతరాల స్వీకరణకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. అన్ని పంచాయతీ ప్రజల సమ్మతితోనే మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిన దృష్ట్యా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- ములుగు మండలంలో ఇప్పటి వరకు 32 పంచాయతీలున్నాయి. కొత్తగా మల్లంపల్లి మండలం చేయడంతో ములుగు మండలం పరిధిలోని 10 పంచాయతీలు తగ్గనుండగా, 22 పంచాయతీలతో ములుగు మండలం పరిమితం కానుంది. 14 పంచాయతీలతో మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. ఆత్మకూరు, శాయంపేట, నల్లబెల్లి సరిహద్దు మండలాలుగా ఏర్పడనున్నాయి.
జిల్లాలో పది మండలాలు
ఇప్పటి వరకు తొమ్మిది మండలాలకే పరిమితమైన ములుగు జిల్లా ఇక నుంచి 10 మండలాలతో విస్తరించనుంది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం సరసన మల్లంపల్లి మండలం చేరనుంది.
కుసుమ జగదీశ్వర్ పేరుతో..
మండలం ఏర్పాటు అనేది మాజీ జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ కలగా మిగిలిపోవడంతో.. ఆయన పేరుతో మండలం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
- మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 17,768 మంది జనాభా ఉన్నారు.
2014 నుంచి పోరాటం
- చందా కుమారస్వామి, మల్లంపల్లి సర్పంచి
2014 నుంచి మండలం సాధించేందుకు ఉద్యమం సాగిస్తున్నాం. మల్లంపల్లి దాని చుట్టుపక్కల 36 గ్రామాల ప్రజలు మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను వేడుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ మండలాన్ని ప్రకటించారు. కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, హరీశ్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ కవిత, రెడ్కో ఛైర్మన్ సతీష్రెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు, ప్రస్తుత తాత్కాలిక జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతిలకు కృతజ్ఞతలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
[ 02-05-2024]
నేతలు ఎన్నికల ప్రచారంలో చేసే ఉపన్యాసాలను పరిశీలిస్తే అంశం ఒకటే అయినా వారు వెల్లడించే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 24న హనుమకొండ మడికొండలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గత ఆదివారం వరంగల్ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఒకే అంశంపై చేసిన విమర్శలు విభిన్నంగా ఉన్నాయి. -
గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ రోడ్షో
[ 02-05-2024]
మానుకోటలో జై తెలంగాణ నినాదాలు మరోసారి మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనాడు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జై తెలంగాణ నినాదాలు దారి పొడవునా మార్మోగాయి. -
మన అభ్యర్థులంతా బంగారు కొండలే..!
[ 02-05-2024]
భారతీయులందరికీ బంగారం అంటే ఎంతో మక్కువ. అందుకే పండగలు, పెళ్లిళ్లు, ఏ ప్రత్యేక సందర్భంలోనైనా పసిడి కొనుగోలు చేసేందుకు అమితంగా ఇష్టపడతారు. తమ ధగధగల నగలను ఎదుటి వారికి చూపేందుకు ఇష్టపడతారు. ఇందుకు లోక్సభ బరిలో ఉన్న మన అభ్యర్థులు అతీతమేం కాదు. -
‘బాలరాముడి పేరుతో భాజపా రాజకీయం’
[ 02-05-2024]
అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. -
దేశం గర్వించేలా మోదీ పాలన
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో కార్నర్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. -
ప్రత్యేక కార్యాచరణ.. పటిష్ఠ పర్యవేక్షణ
[ 02-05-2024]
జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి, జిల్లా విద్యాశాఖ ప్రణాళికబద్ధంగా నిరంతరం పర్యవేక్షణ, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలాంటి పటిష్ఠ చర్యలతో ఈ విద్యాసంవత్సరం (2023-24)లో జిల్లా పదోతరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. -
ఎండు గంజాయి పట్టివేత
[ 02-05-2024]
ఓ వ్యక్తి వద్ద ఎండు గంజాయి పట్టుకున్న ఘటన డోర్నకల్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెలువరించారు. -
‘మత ఘర్షణలు సృష్టించేందుకు భాజపా, భారాస ప్రయత్నం’
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు భాజపా, భారాస లోపాయికారి ఒప్పందం చేసుకొని మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల నిర్వహణ మానిటరీ కమిటీ కో-ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి ఆరోపించారు. -
బాలలతో పని చేయించడం నేరం
[ 02-05-2024]
14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సి.సురేష్ అన్నారు. మే డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. -
పంచాయతీలకు గూడు కరవు..!
[ 02-05-2024]
జిల్లా పరిధిలో మంజూరైన భవనాల్లో ములుగు, వెంకటాపూర్ మండలాల్లోనే ఏడు పనులు పూర్తి కాగా, 34 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు సకాలంలో అందకపోవడంతో గుత్తేదారులు అర్థాంతరంగా వదిలేశారు. ఉన్నతాధికారులు చొరవ చూపితేనే పనులు పూర్తి కానున్నాయి. -
సైబర్ మోసాల నియంత్రణకు కృషి
[ 02-05-2024]
జిల్లాలో సైబర్ సెక్యూరిటీ కేసులను చేదించే దిశగా పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా బుధవారం ములుగులో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని (ములుగు జిల్లా కోఆర్డినేషన్ సెంటర్) ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హనుమకొండలోని చైతన్య డీమ్డ్ వర్సిటీలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఏపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
కార్మిక పక్షపాతి కేసీఆర్
[ 02-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కార్మిక పక్షపాతి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. -
భానుడి భగభగలు..
[ 02-05-2024]
జిల్లాలో ఏప్రిల్ మాసం మొదటి నుంచే వేసవి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక మే నెల ప్రారంభం కావడంతో బుధవారం నుంచే భానుడు మండుతున్నాడు. -
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలను జనగామ జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
సత్తాచాటిన గురుకుల విద్యార్థులు
[ 02-05-2024]
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ, గురుకుల విద్యాలయాల విద్యార్థులు పదో తరగతిలో ప్రతిభ చాటారు. జయశంకర్ జిల్లాలో మొత్తం 28 వరకు గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. -
పైసలిస్తేనే దస్త్రం కదిలేది!
[ 02-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు మారడం లేదు. భవన నిర్మాణ అనుమతుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పైసలిస్తే సరి.. లేదంటే కొర్రీలు పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. -
విజ్ఞానం.. వినోదం.. ఆధ్యాత్మికం
[ 02-05-2024]
పదోతరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.. విద్యార్థులకు ఉపశమనం లభించింది. తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే వరకు ఈ వేసవి సెలవులను విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలి. -
71,245 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు
[ 02-05-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటుంటాం. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద దరావతు (డిపాజిట్) చేయాల్సి ఉంటుంది. -
రెండు నియోజకవర్గాలకు రహదారే సరిహద్దు
[ 02-05-2024]
ఈ చిత్రంలో ఉన్నది ఒకే గ్రామంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి జంట గ్రామాలు. మధ్యలో సరిహద్దుగా ఉన్న సీసీ రోడ్డు.. రెండు పంచాయతీలు, రెండు జిల్లాలు, రెండు శాసనసభ నియోజకవర్గాలు, రెండు లోక్సభ నియోజకవర్గాలను వేరు చేస్తోంది. -
ఉద్యోగాల పేరుతో టోకరా కేసు.. మరో నిందితుడి అరెస్టు
[ 02-05-2024]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో హనుమకొండ సుబేదారి పోలీసులు మరో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు