అగ్రనేతల ఆగమనం
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఇక హోరెత్తనున్న ప్రచారం..
ఈనాడు, వరంగల్
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చేసిన అభివృద్ధిని వివరించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. హామీల అమలును ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. మొత్తానికి తమ ఉపన్యాసాలతో మాటల తూటాలు పేల్చనున్నారు.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి పార్టీల అగ్రనేతలు వరుసకట్టనున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు హోరెత్తనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి మొదలుకొంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారాస అధినేత కేసీఆర్ ఆయా పార్టీల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఓరుగల్లుకు రానున్నారు.
ముఖ్యమంత్రితో మొదలు
అధికార కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్లోని రెండు స్థానాలపై గురిపెట్టింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే రెండు సభలు ఖరారయ్యాయి. శుక్రవారం మానుకోటలో పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ తరఫున భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. 24వ తేదీన వరంగల్ అభ్యర్థిని కడియం కావ్య తరఫున హనుమకొండలోని మడికొండ సభలో ప్రసంగిస్తారు. అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజే ముఖ్యమంత్రి సభలు ఉండేలా షెడ్యూలు ఖరారు చేశారు. తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరంగల్, మానుకోట సభల్లో పాల్గొంటారు. త్వరలో ఈ షెడ్యూలు వస్తుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
ప్రధాని మోదీ రాక కోసం..
వరంగల్ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ అట్టహాసంగా నామపత్రాలు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 24న నామపత్రాలు వేసే ముందు హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరవుతున్నారు. వరంగల్ లోక్సభపై కమలం గట్టి అంచనాలతో ఉన్నందున ప్రచారానికి ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని భాజపా శ్రేణులు చెబుతున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేలా ప్రణాళిక రచిస్తున్నారు. మోదీ సభ వరంగల్లో ఏర్పాటుచేయాలని కోరుతూ తాము లేఖ రాశామని వరంగల్ జిల్లా భాజపా అధ్యక్షుడు గంటా రవి తెలిపారు.
రెండు చోట్ల కేసీఆర్
భారాస అధినేత కేసీఆర్ వరంగల్, మహబూబాబాద్ రెండు చోట్ల సభల్లో పాల్గొననున్నారు. వరంగల్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్, మానుకోట అభ్యర్థిని కవిత తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. గులాబీ అధినేత పర్యటన షెడ్యూలు ఇంకా ఖరారు కాలేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏప్రిల్ 23న వర్ధన్నపేటలో అసెంబ్లీ నియోజవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ర్యాలీలు, రోడ్డు షోల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మాజీ మంత్రి హరీశ్రావు సైతం ఉమ్మడి వరంగల్లో పలుమార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా భారాస ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం
[ 01-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. -
‘పది’లో సత్తా చాటారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. -
‘సాగునీరు అందించే బాధ్యత నాదే’
[ 01-05-2024]
భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM